Switch to English

Bichagadu 2 Pre Release Event: ‘బిచ్చగాడు 2’ కోసం వాళ్లిద్దరూ ప్రాణం పెట్టారు: అడివి శేష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Bichagadu 2 Pre Release Event: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు 2 సినిమా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. విజయ్ ఆంటోనీకి జోడిగా ఈ సినిమాలో కావ్యా థాపర్ నటించారు. తెలుగులో ఈ సినిమాను ఉషా పిక్చర్స్ బ్యానర్ మీద విజయ్ కుమార్, వీరనాయుడు సంయుక్తంగా మే 19న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడివి శేష్‌, ఆకాష్ పూరిలు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో

అడివి శేష్ మాట్లాడుతూ.. ‘మనమే కథలు రాస్తున్నాం.. మనమే సినిమాలు చేస్తున్నామని అని అనుకున్నాను. కానీ విజయ్ గారు మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా చేస్తున్నారు. బిచ్చగాడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని విజయ్ సర్ ఫోన్ చేశారు. వచ్చే ఐదు రోజుల్లో ఐదు డిఫరెంట్ సిటీల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఉషా పిక్చర్స్ నాయుడు గారికి థాంక్స్. సురేష్‌ గారు నా కెరీర్ ప్రారంభం నుంచి అండగా ఉన్నారు. బిచ్చగాడు సినిమాలో నెంబర్ ప్లేట్ సీన్ నాకు చాలా ఇష్టం. సినిమా కోసం ప్రాణం పెట్టి అందరూ చెబుతుంటారు. కానీ ఫాతిమా గారు, విజయ్ గారు నిజంగానే ప్రాణం పెట్టారు. కావ్య తెలుగులో చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. మే 19న బిచ్చగాడు 2 సినిమా థియేటర్లోకి రాబోతోంది’ అని అన్నారు.

ఆకాష్‌ పూరి మాట్లాడుతూ.. ‘బిచ్చగాడు సినిమా టైటిల్ వినగానే ఇదేం టైటిల్ అనుకున్నా. కానీ ఆ సినిమా ఓ చరిత్రను సృష్టించింది. చిన్న సినిమాలకు బిచ్చగాడు ఫ్లాట్‌ఫాంలా మారింది. ఈ సినిమా ఎంతో మందికి కాన్ఫిడెంట్‌ ఇచ్చింది. విజయ్ ఆంటోని ని ఇంత వరకు ప్రేమిస్తూ వచ్చాను. కానీ ఆయన్ను కలిశాక గౌరవించడం ప్రారంభించాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి థాంక్స్. అడివి శేష్‌ గారి గూఢచారి చిత్రం తీయడం ఎంతో కష్టం. ఆయనతో కలిసి ఇలా స్టేజ్ పంచుకోవడం ఆనందంగా ఉంది. కమర్షియల్ సినిమాలు తీయడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ పూరి జగన్నాథ్ గారు అద్భుతంగా తీస్తుంటారు. ఆయన కొడుకు ఆకాష్ పూరిని ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న వీరమనాయుడు, విజయ్ గారికి థాంక్స్. పెళ్లి చేసి అమ్మాయిని మెట్టింటికి పంపిస్తుంటే.. తండ్రి బాధపడుతుంటాడు. ప్రతీ సినిమా విషయంలో మేం కూడా భయపడుతుంటాము. కానీ మా డిస్ట్రిబ్యూటర్లు వీరమనాయుడు, ఉషా పిక్చర్స్‌ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో నాకు ఎలాంటి భయం లేదు. భాషా శ్రీ గౌరవ్ నా ఆలోచనలన్నీ తెలుగులో చక్కగా చెబుతుంటారు. నన్ను ప్రమాదం నుంచి కాపాడిన కావ్యకు థాంక్స్. నా తప్పు వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. అన్ని రకాలుగా ఎంతో అండగా ఉంటున్న నా భార్య ఫాతిమాకు థాంక్స్. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రెండో పార్ట్‌లోనూ ఉంటాయి. బిచ్చగాడు మొదటి పార్ట్ నచ్చిన అందరికీ కూడా రెండో పార్ట్ నచ్చుతుంది. మే 19న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది’ అని అన్నారు.

ఫాతిమా విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘విజయ్ ఆంటోనికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎక్కువ ప్రేమ వస్తుంది. బిచ్చగాడు సినిమాను పెద్ద హిట్ చేశారు. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ కూడా ఆయన్ను ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. నకిలీ సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. వీరనాయుడు మాకు గాడ్ ఫాదర్ లాంటి వారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఉషా పిక్చర్స్, వీరమనాయుడు కలిసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాకు కేవలం నిర్మాతను మాత్రమే. అన్నీ మా ఆయన విజయ్ ఆంటోనీయే చూసుకున్నారు. సంక్రాంతి రోజు మలేషియాలో షూటింగ్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని మేనేజర్ కాల్ చేసి మాట్లాడారు. మేడం యాక్సిడెంట్ అయింది.. సర్‌కి స్పృహ కూడా లేదు అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఆ టైంలో సోషల్ మీడియా నుంచి అభిమానుల ప్రేమ నాకు అందింది. ఆయన తిరిగి వస్తారనే నమ్మకాన్ని అభిమానులు నాకు ఇచ్చారు. అభిమానుల ప్రేమ వల్లే మేం ఇలా బతికి ఉన్నాం. బాధలన్నీ తొలిగిపోయాయ్ ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతోంది. అంతా సంతోషంగా ఉంది. ఇంత గొప్పగా ఈవెంట్‌ను ప్లాన్ చేసినందుకు థాంక్స్. మే 19న థియేటర్లోనే ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ విజయ్ మాట్లాడుతూ.. ‘మా నాన్న బాలకృష్ణ గారు ఇప్పటికీ కళామతల్లిని నమ్ముకుని ఉన్నారు. ఈ 49 ఏళ్లలో 2200 పైచిలుకు సినిమాలు చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లకు ఎక్కారు. ఎంతో మంది అండతో ఈ స్థాయికి మేం ఎదగగలిగాం. మాకు సహకరించిన అందరికీ థాంక్స్. 1995లో విజయ్ ఆంటోనీ గారు ఓ బాయ్‌గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత టెక్నీషియన్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎన్నో హిట్స్ ఇచ్చారు. హీరో అవ్వాలని అనుకుంటున్నాను అని చెబితే హేళన చేసేవారట. కానీ ఆయన ఇప్పుడు ఎంతో పెద్ద హీరో అయ్యారు. మా మీద నమ్మకంతో బిచ్చగాడు 2 సినిమాను మాకు ఇచ్చిన విజయ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

కావ్యా థాపర్ మాట్లాడుతూ.. ‘బిచ్చగాడు 2 సినిమా మే 19న రాబోతోంది. విజయ్ గారు ఎంతో నొప్పిని భరిస్తూ కూడా పాట పాడారు. ఆయన కోసమే వచ్చి డ్యాన్స్ చేశాను. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయనతో ఉన్న ప్రతీ సీన్‌లోనూ ఎంతో నేర్చుకున్నాను. ఆయన నాకు ఓ మంచి స్నేహితుడు. హేమ పాత్రను నాకు ఇచ్చినందుకు థాంక్స్. ఫాతిమా మేడం, విజయ్ సర్‌కు థాంక్స్’ అని అన్నారు.

లిరిక్ రైటర్ భాషా శ్రీ మాట్లాడుతూ.. ‘2016లో బిచ్చగాడు రిలీజ్ అయింది. ఆ సినిమా తెలుగులో రికార్డులు బద్దలు చేసింది. బిచ్చగాడు 2 మీరు ఊహించిన దాని కంటే పది రెట్లు ఉంటుంది. మొదటి పార్ట్‌కు మాటలు, పాటలు రాశాను. ఈ రెండో పార్ట్‌కూ రాశాను. త్వరలో మూడో పార్ట్ కూడా ఉంటుంది’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...