Switch to English

జనసేనానికి వెయ్యి కోట్లు.! ఈ రాత కోసం ఎన్ని పాట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

చీకట్లోకి రాయి విసరడం చాలా తేలిక.! అలాగే, వెకిలి రాతలు రాయడం కూడా. ఏబీఎన్ లాంటి ఓ మీడియా సంస్థకి అధినేత అయిన వేమూరి రాధాకృష్ణ అంతే తేలిగ్గా వెకిలి రాతలు రాసేస్తుంటాడు. జర్నలిజానికి పట్టిన చీడ.. పాత్రికేయానికి పట్టిన క్యాన్సర్.. ఇలా ఎన్నయినా అనుకోవచ్చు. అవన్నీ ఆయన పైశాచిక రాతల ముందు చిన్నబోతాయ్.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంసిద్ధంగా వున్నారట. ఇప్పటికే ఈ విషయమై పవన్ కళ్యాణ్‌తో మంతనాలు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీయార్ షురూ చేశారట.

‘సీఎం పవన్ కళ్యాణ్’ అనే నినాదంతోనే ఒంటరిగా జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలన్నది కేసీయార్, పవన్ కళ్యాణ్ ముందుంచిన ప్రతిపాదన అట. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో అధికారం వచ్చినా రాకపోయినా, చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వస్తాయని కేసీయార్, పవన్ కళ్యాణ్‌కి సూచించారట.

నలుగురూ నవ్విపోదురుగాక ఏబీఎన్ రాధాకృష్ణకేటి సిగ్గు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఇందులో వింతేముంది.? వెయ్యి కోట్ల రూపాయల్ని పవన్ కళ్యాణ్‌కి కేసీయార్ ఎందుకు ఇస్తారన్న కనీస ఇంగితం లేకుండా పోయింది ఏబీఎన్ రాధాకృష్ణకి. వైసీపీకి పరోక్షంగా మేలు చేయాలన్నది కేసీయార్ ఆలోచన అట. వైసీపీకి మేలు చేస్తే, కేసీయార్‌కి వచ్చే లాభమేంటి.?

ఆ వెయ్యి కోట్లు తెలంగాణలో ఖర్చ పెట్టుకోవడమో.. లేదంటే, భారత్ రాష్ట్ర సమితి తరఫున ఆంధ్రప్రదేశ్‌లో ఖర్చుబెట్టుకోవడమో కేసీయార్ చేస్తారుగానీ.. పవన్ కళ్యాణ్‌కి ఇచ్చే అవకాశమెందుకు వుంటుంది.? పోనీ, వైసీపీ అంటే కేసీయార్‌కి అంతటి అభిమానమే అనుకుందాం. అలాంటప్పుడు, ఆ వైసీపీ తరఫున ఖర్చు చేసుకుంటారు కదా కేసీయార్.?

గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఇదిగో ఇలాంటి వెకిలి రాతలే రాసింది టీడీపీ అనుకూల మీడియా. ఇప్పుడు అంతకు మించిన విషం చిమ్ముతోంది అదే టీడీపీ అనుకూల మీడియా. అందునా, టీడీపీకి బానిసత్వం చేసే ఏబీఎన్ రాధాకృష్ణ నుంచి ఈ తరహా విషపు రాతలు వస్తున్నాయంటే.. తెరవెనుకాల పెద్ద కథే వుందన్నమాట.

నందమూరి తారకరత్న చనిపోయినట్లు నిన్ననే ప్రకటన వచ్చింది. ఈ రోజు పొద్దున్న ఈ ప్యాకేజీ వార్త.! అసలేంటి కథ.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...