Switch to English

వైఎస్ జగన్‌పై టీడీపీ ఛార్జిషీట్.! రెండు లక్షల కోట్లు దోచేశారట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సీబీఐ, ఈడీ, సీఐడీ వంటి దర్యాప్తు సంస్థలు వేసే ఛార్జిషీట్లకే దిక్కు వుండటంలేదు.. మరి, రాజకీయ పార్టీలు ప్రకటించే ఛార్జిషీట్లకు వీసమెత్తు విలువైనా వుంటుందా.? అంటే, ఈ పొలిటికల్ ఛార్జిషీట్లు.. ప్రజా కోర్టులో ఒక్కోసారి గట్టిగానే ప్రభావం చూపుతాయ్ మరి.! న్యాయస్థానాల్లో ఆయా దర్యాప్తు సంస్థలు నమోదు చేసే ఛార్జిషీట్లకు సంబంధించి శిక్షలు పడటం అనేది ఓ పెద్ద ప్రసహనం. రాజకీయ చార్జిషీట్లతో మాత్రం ఒక్కోసారి ఫలితం చాలా వేగంగా వస్తుంటుంది.

అసలు విషయంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ తాజాగా ఛార్జిషీటుని తీసుకొచ్చింది.. అదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద. గడచిన మూడేళ్ళ పాలన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ నమోదు చేసిన ఛార్జిషీటులో దోపిడీ విలువ ఎంతో తెలుసా.? అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయలు.!

సీబీఐ గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సుమారు 43 వేల కోట్ల రూపాయల అక్రమాలంటూ ఛార్జిషీట్లు దాఖలు చేసిన విషయం విదితమే. అంతకు ముందు టీడీపీ ఆరోపణలు.. లక్ష కోట్ల రూపాయల అవినీతి.. అంటూ జరిగాయి. మరిప్పుడు, టీడీపీ ప్రకటించిన పొలిటికల్ ఛార్జిషీటు తాలూకు ప్రభావం ఎలా వుండబోతోంది.? 2 లక్షల కోట్ల రూపాయల అవినీతి.. అంటూ వైఎస్ జగన్ మీద టీడీపీ చేస్తోన్న ఆరోపణల్లో నిజమెంత.?

దేశంలో అవినీతి రహిత పాలన.. అంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అవినీతి వ్యవస్థీకృతమైపోయి దశాబ్దాలు గడుస్తోంది. ఇందుగలదందు లేదని సందేహము వలదు.. అన్నట్టు తయారైంది అవినీతి పరిస్థితి. టీడీపీ హయాంలో కేవలం టీడీపీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లకే పనులు దక్కాయ్.. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన వారికి మాత్రమే కాంట్రాక్టులు దక్కుతున్నాయ్. కాంట్రాక్టులంటేనే అవినీతి.! ఆ లెక్కన అవినీతి లేకుండా ఎలా వుంటుంది.?

ఇసుకని దోచేస్తున్నారు.. మట్టిని దోచేస్తున్నారు.. అసలు దోచెయ్యనిదంటూ ఏమైనా వుందా.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతికి చెందిన సంస్థలకు ప్రభుత్వం తరఫున ఎన్ని ‘వెసులుబాట్లు’ కలుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాక్షి మీడియానే తీసుకుంటే, అందులో పనిచేసినోళ్ళకి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కిన విషయం విదితమే.

చెప్పుకుంటూ పోతే చాలానే కథ వుంది. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుంటే, రెండు లక్షల కోట్లేంటి.? అంతకు మించిన అవినీతి జరిగి వుండొచ్చన్న చర్చ జనబాహుళ్యంలో జరుగుతోంది.

ల్యా0డ్ మాఫియా 20 వేల కోట్లు, శాండ్ మాఫియా 10 వేల కోట్లు, మైనింగ్ మాఫియా 35 వేల కోట్లు, మద్యం మాఫియా 26 వేల కోట్లు, డ్రగ్స్ మాఫియా 21 వేల కోట్లు, లేపాక్షి ల్యాండ్ స్కామ్ 15 వేల కోట్లు, గంజాయి మాఫియా 10 వేల కోట్లు, రేషన్ బియ్యం మాఫియా 7 వేల కోట్లు, ఎర్ర చందనం మాఫియా 25 వేల కోట్లు, సిమెంటు మాఫియా 12 వేల కోట్లు, సెంటు పట్టాలో లూటీ 7 వేల కోట్లు.. అంబులెన్స్, బియ్యం వ్యాన్లు, ఇతరాల్లో 10 వేల కోట్లు.. ఇదీ టీడీపీ చార్జిషీటులోని ముఖ్యాంశాలు.!

వైఎస్ జగన్‌పై టీడీపీ ఛార్జిషీట్.! రెండు లక్షల కోట్లు దోచేశారట.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...