Switch to English

సంగం సరే.! పోలవరం ప్రాజెక్టు సంగతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసుల కల సంగం బ్యారేజీ.. నానా రాజకీయ అరిష్టాలూ తట్టుకుని ఎలాగైతేనేం, ఆ ప్రాజెక్టు పూర్తయ్యింది. రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారు.? ఎవరు నిజంగా బ్యారేజీ నిర్మాణం కోసం చిత్తశుద్ధి చూపారు.? అన్న విషయాల్ని పక్కన పెడితే, ప్రాజెక్టు పూర్తవడం సంతోషమే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

కానీ, పోలవరం ప్రాజెక్టు సంగతేంటి.? ఎప్పుడో బ్రిటిష్ హయాంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతిపాదనలు మొదలైతే, ఆజాదీ కా అమృత మహోత్సవం పూర్తి చేసుకున్నా.. అంటే, ఈ డెబ్భయ్ ఐదేళ్ళ స్వతంత్ర భారతావనిలో ఇంకా పోలవరం ప్రాజెక్టుకి పట్టిన రాజకీయ గ్రహణమైతే వీడటంలేదు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏవైతే పబ్లిసిటీ స్టంట్లు జరిగాయో, అంతకు మించిన పబ్లిసిటీ స్టంట్లు చంద్రబాబు హయాంలోనూ జరిగాయి. దానికి మించిన స్థాయిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు చుట్టూ పబ్లిసిటీ స్టంట్లు నడిచాయి. ‘ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం..’ అని జలవనరుల శాఖ తాజా మంత్రి అంబటి రాంబాబు వెటకారం చేసే స్థాయికి పోలవరం ప్రాజెక్టు ‘కామెడీ’ అయిపోయింది.!

ఓ ప్రాజెక్టుకి ఇంతటి రాజకీయ గ్రహణం పట్టడం అనేది బహుశా దేశ చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ లేదేమో.! లక్షల కోట్ల రూపాయల సొమ్ముల్ని ప్రజల ఖాతాల్లోకి నేరుగా సంక్షేమ పథకాల పేరుతో పంపిస్తున్నామని ‘బటన్ నొక్కి’ మరీ చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

మరి, పోలవరం ప్రాజెక్టు విషయమై ‘నొక్కేందుకు’ ఎందుకు ఆ బటన్ పని చేయడంలేదన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. ‘కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం..’ అన్నారు గతంలో. ప్రత్యేక హోదా సంగతి దేవుడెరుగు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిథుల్ని అయినా కేంద్రం నుంచి సకాలంలో తెప్పించుకోవాలి కదా.?

ఏళ్ళు గడిచిపోతున్నాయ్.. పోలవరం ప్రాజెక్టుకి వరదలొస్తున్నాయ్.. ప్రతిసారీ బురద రాజకీయమూ వస్తుంటుంది. అంతేగానీ, ప్రాజెక్టు మాత్రం పూర్తవడంలేదు. చంద్రబాబు హయాంలోనూ రిబ్బన్ కటింగ్ వ్యవహారాలు చాలానే జరిగాయ్.. ఇప్పుడూ జరుగుతున్నాయ్.! ఇకపైనా జరుగుతాయ్. ఎవరికి పోలవరం ప్రాజెక్టు తాలూకు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం దొరుకుతుందో ఏమో.!

‘చెప్పాడంటే.. చేస్తాడంతే..’ అంటూ సంగం బ్యారేజీ విషయమై ఘనంగా చెప్పుకుంటున్న వైసీపీ శ్రేణులు, ప్రత్యేక హోదా.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం, సీపీఎస్ రద్దు.. వీటిపై మాత్రం ‘మాట తప్పుడు.. మడమ తిప్పుడు..’ వైఖరిపై నోరు మెదపగలవా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....