Switch to English

అమ్ముడుపోతారా.? ‘కాపు’ సామాజిక వర్గం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రెడ్డి సామాజిక వర్గం ఓట్లను ఎవరూ అమ్మలేరు, ఇంకెవరూ కొనలేరు. కమ్మ సామాజిక వర్గం ఓట్లను కూడా ఎవరూ అమ్మలేరు, ఇంకెవరూ కొనలేరు. బీసీ, ఎస్సీ – ఎస్టీ, మైనార్టీ ఓట్లను కూడా ఎవరూ కొనలేరు, అమ్మలేరు. కానీ, కాపు సామాజిక వర్గం ఓట్లను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అమ్మేస్తారు.!

తెలుగు రాష్ట్రాల్లో, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం పేరుతో నడుస్తున్న రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కులం పేరు ప్రస్తావించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు నడవడంలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ అధికారిక కార్యక్రమంలో కాపు సామాజిక వర్గానికి హెచ్చరిక చేశారు. అదీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని దత్త పుత్రుడిగా అభివర్ణిస్తూ.

ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయకపోయినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘దత్త పుత్రుడు’ అనకూడదు. రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి వైసీపీ మద్దతిచ్చినా, వైఎస్ జగన్‌ని ‘దత్తపుత్రడు’ అనకూడదు. కానీ, పవన్ కళ్యాణ్ మీద మాత్రం ‘దత్త పుత్రుడు’ అనే ముద్ర వేసేస్తారు వైఎస్ జగన్. ఆదీ రాజకీయమంటే.

2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం జనసేన వెంట నడవడలేదు. నడిస్తే, రాజకీయం ఇంకోలా వుండేది. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం‌ని అడ్డం పెట్టి చీలిక తెచ్చాకి టీడీపీ, వైసీపీ అప్పట్లో. ఇప్పుడేమో, పవన్ కళ్యాణ్ పేరు చెప్పి.. కాపు సామాజిక వర్గంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబుకి కాపు సామాజిక వర్గం ఓట్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమ్మేయడమేంటి.? అలాగని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక కార్యక్రమంలో వ్యాఖ్యానించడమేంటి.? కాపు సామాజిక వర్గం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది.

కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు, రెడ్డి సామాజిక వర్గం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రులయ్యారుగానీ, కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకూడదు.!

కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం జనాభా ఎక్కువ. కానీ, అధికారానికి కాపు సామాజిక వర్గం దూరంగానే వుండాలి.! ఈ చర్చ కాపు సామాజిక వర్గంలో జరుగుతోందిప్పుడు.

దానిక్కారణం, కాపు సామాజిక వర్గం ఓట్లు అమ్ముడైపోతాయ్.. అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడమే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...