లేటెస్ట్ అప్డేట్: ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన 14 మందిని హాస్పిటల్ కి తరలించారు. వారిలో ఆరుగురు చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 13కి చేరింది. మిగిలిన వారికి ట్రీట్మెంట్ జరుగుతోంది.
కృష్ణ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్ను లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాల పాలయ్యి జగ్గయ్యపేట హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా నలుగురి పరిస్థితి సీరియస్గా ఉందని వైధ్యులు పేర్కొన్నారు. ఈ యాక్సిడెంట్కు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు బాధితుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిర కు చెందిన 24 మంది వేదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనం కోసం వెళ్తున్నారు. దేవాలయం దగ్గరకు వెళ్లిన తర్వాత మరికాసేపట్లో స్వామి వారిని దర్శించుకుంటాం అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ట్రాలీలో ఉన్న వారు చెల్లా చెదురుగా పడ్డారు. లారీ అతి వేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.
257285 298755If your real pals know you as your nickname, use that nickname as your 1st name online. When you initial friend someone, focus on making a personal comment that weaves connection. 438619
359784 896776Wow, cool post. Id like to write like this too – taking time and real effort to make a excellent article but I procrastinate too a lot and never seem to get started. Thanks though. 316347
523260 352022I discovered your weblog website on google and check some of your early posts. Continue to maintain up the extremely great operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading more from you later on! 110259