ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియా లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. టెస్టు సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టు సిరీస్ లు పూర్తి అయ్యాయి. మూడవ టెస్టు ఈనెల 7వ తారీకు నుండి సిడ్నీలో ప్రారంభం అవ్వాల్సి ఉంది.
ఆస్ట్రేలియా మరియు టీం ఇండియా ఆటగాళ్లను ఒక బయో సెక్యూరిటీ వలయంలో ఉంచి కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వారు ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం కాని ఇతరులను కలవడం కాని చేయకూడదు. కాని న్యూ ఇయర్ సందర్బంగా అయిదుగురు టీం ఇండియా ఆటగాళ్లు ఒక రెస్టారెంట్ లో ఆహారం తీసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీం ఇండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభమన్ గిల్, పృథ్వీషా, నవదీప్ సైనీలు బయట రెస్టారెంట్ లో ఆహారం తీసుకున్నట్లుగా వీడియోలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా వారిని ఐసోలేషన్ కు పంపించడం జరిగింది. వారిని ఐసోలేషన్ లో ఉంచడంతో బీసీసీఐ స్పందించింది.
వారు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే అక్కడ ఆహారం తీసుకున్నారు. కనుక దీన్ని రాద్దాంతం చేయనక్కర్లేదు అన్నారు. ఈ అయిదుగురును మూడవ టెస్టు ఆడేందుకు సీఏ ఒప్పుకుంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
643627 677580Is going to be again frequently to check up on new posts 744580
923109 530185you use a wonderful blog here! do you wish to earn some invite posts on my small blog? 693891