ఐపీఎస్ ను అంటూ విజయ్ కుమార్ రెడ్డి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్ ను అంటూ శిరీష లు పరిచయం చేసుకుని వీరారెడ్డి అనే వ్యక్తి వద్ద ఏకంగా రూ.11.5 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి చివరకు అతడిని మోసం చేసేందుకు ప్రయత్నించారు.
వీరా రెడ్డి నుండి ఒత్తడి రావడంతో విజయ్ కుమార్ అసలు విషయాన్ని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మొత్తం వ్యవహారం కూడా శిరీష ఆధ్వర్యంలో జరిగిందని ఆమె మామూలు లేడీ కాదని ఆమె విలాసాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడింది అంటూ విజయ్ కుమార్ ఆత్మహత్య వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
వీరారెడ్డి ఇచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. శంషాబాద్ లో ఉన్న ఒక విలాసవంతమైన హోటల్లో రోజుకు లక్ష రూపాయలు ఖర్చు చేసి 40 రోజుల పాటు వీరు అక్కడ గడిపారు. ప్రియుడు విజయ్ కుమార్ ప్రియురాలు శిరీషలు అక్కడ నుండి ఆపరేషన్ నిర్వహించారు.
కోటిన్నర పెట్టి కారు కొనుగోలు చేయడంతో పాటు ప్రియురాలు శిరీష కోసం ఏకంగా రూ.50 లక్షల రూపాయలతో బంగారంను విజయ్ కొనుగోలు చేశాడు. ఇలా వారి బాగోతం అంతా ఇంతా కాదు. తనను మోసం చేశారంటూ వీరారెడ్డి ఈనెల 12వ తారీకున ఫిర్యాదు చేయడంతో కేసును విచారిస్తున్న పోలీసులు విస్తు పోయే నిజాలు తెలుసుకున్నారు.
469511 147191Awesome read , Im going to spend much more time researching this subject 658905
523690 862959Hello, you used to write wonderful, but the last several posts have been kinda boringK I miss your super writings. Past several posts are just a bit out of track! come on! 336231
83686 111818Hi my friend! I want to say that this post is awesome, nice written and contain almost all significant infos. Id like to see more posts like this . 894421