దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలలో తాజా గణాంకాలు కలకలం రేపుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల్లో మొన్న 33వేలకు పైగా కరోనా కేసులు నమోదైతే.. రెండో రోజు ఏకంగా 37వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో 12,160, ముంబైలో 8,082, ఢిల్లీలో 4,099 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే.. వీరిలో 90 శాతం మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదని కూడా తెలిపింది. దీంతో దేశంలో రోజువారీ పాజివిటీ రేటు 3.24 శాతానికి చేరింది.
మరోపక్క ఒమిక్రాన్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 1,892గా ఉంది. కొత్తగా 192 మందిలో ఈ వేరియంట్ గుర్తించారు. మహారాష్ట్రలో 568, ఢిల్లీలో 382కు కేసులు పెరిగాయి. కరోనాతో గడచిన 24 గంటల్లో 124 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ 4,82,017 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,71,830 క్రియాశీలక కేసులు ఉన్నాయి. మరోవైపు టీకా కార్యక్రమం కొనసాగుతోంది.
17615 105583I genuinely enjoyed your incredible web site. Be confident to keep it up. May possibly god bless you !!!! 775581
417811 311658This is a terrific internet site, could you be interested in performing an interview about just how you produced it? If so e-mail me! 588171