దేశంలో ఆక్సిజన్ కొరతపై మాక్ డ్రిల్ ద్వారా చూపించాలన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం 22 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోవడానికి కారమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 26న ఆగ్రాలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ దారుణ వికృత చర్యపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆక్సిజన్ బెడ్స్పై 96 మంది కరోనా రోగులున్న ప్రైవేటు ఆసుపత్రి యజమాని అరింజయ్ జైన్ తీసుకున్న నిర్ణయంతో ఉదయం 7గంటలకు ఓ ఐదు నిమిషాలపాటు రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారు.
ఈ వికృత చర్యతో నిముషాల్లోనే 22 మంది పరిస్థితి విషమించింది. వాళ్ల శరీరం నీలం రంగులోకి మారిపోవడంతో.. వెంటనే ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించి వారంతా మృతి చెందారు. ఈ వీడియో మీడియాలో ప్రసారం కావడం, వివాదం కావడంతో యూపీ ప్రభుత్వం అలెర్టయింది. మిగిలిన 74 మందికి ఇబ్బంది లేకపోయింది. ఆసుపత్రి వర్గాలు మాత్రం నలుగురు మాత్రమే చనిపోయారని అంటోంది.
582392 84798Some truly good stuff on this internet site , I like it. 464845
780877 152I believe this web site contains quite superb composed articles posts . 501568
531741 164267I believe this website contains some quite fantastic information for every person : D. 480781