కార్గిల్ పేరు చెప్పగానే చాలా విషయాలు స్ఫురణకు వస్తాయి. స్నేహహస్తం సాచిన మనల్ని దొంగదెబ్బ తీయాలని భావించిన పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్పిన సంగతి కనుల ముందు కదలాడుతుంది. సంక్లిష్ట పరిస్థితుల మధ్య 73 రోజులపాటు సాగిన ఆ యుద్ధంలో దాయాదిని మట్టికరిపించి నేటికి సరిగ్గా 21 ఏళ్లు పూర్తయ్యాయి. మంచుకొండల మాటున ఉగ్రవాదుల ముసుగులో వారితో కలిసి మనల్ని దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నించిన పాక్ కు మరచిపోలేని గుణపాఠం చెప్పి, ఆ దేశం అసలు రంగును ప్రపంచం ముందు పెట్టడంలో అప్పుడు సంపూర్ణ విజయం సాధించాం.
కార్గిల్ సెక్టార్ మంచుకొండలతో నిండి ఉంటుంది. శీతాకాలంలో అక్కడ ఉండటం చాలా కష్టం. అందుకే శీతాకాలంలో కార్గిల్ సెక్టార్ లో సైనిక శిబిరాలు ఖాళీ చేయాలని భారత్, పాక్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ మేరకు మనవాళ్లు సైనిక శిబిరాల్ని ఖాళీ చేశారు. అయితే, అదే అదనుగా మనదేశంలోకి చొరబడాలని నిర్ణయించుకున్న పాక్.. ఉగ్రవాదులతో కలిసి నియంత్రణ రేఖ దాటి మన భూభాగంలో ప్రవేశించింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానిక గొర్రెల కాపరులు.. భారత సైనికులకు చెప్పడంతో ఐదుగురు సైనికులు అక్కడకు వెళ్లారు. వారిని బంధించి చిత్రహింసలు పెట్టి చంపేశారు. 1999 మే 5న ఈ ఘటన చోటుచేసుకుంది.
అనంతరం కార్గిల్ లోని మన ఆయుధ శిబిరాన్ని పాక్ ఆర్మీ ధ్వంసం చేసింది. ద్రాస్, కక్సర్, మష్కో సెక్టార్లలో కూడా చొరబాట్లు గుర్తించారు. వెంటనే భారత ఆర్మీ రంగంలోకి దిగింది. కార్గిల్ వైపు సేనలను తరలించింది. దీనికి ఆపరేషన్ విజయ్ అని మన సైన్యం నామకరణం చేసింది. సైన్యానికి తోడుగా వాయుసేన కూడా దాడులు మొదలుపెట్టింది. అయితే, పాకిస్థాన్ రెండు యుద్ధ విమానాలను కూల్చివేసింది. దీంతో మన వాయుసేన మరింతగా విరుచుకుపడింది. మరోవైపు ఆ చొరబాట్లతో తమకు సంబంధం లేదంటూ పాక్ బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ అందులో పాక్ సైనిక ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను సాక్ష్యాలతో సహా భారత్ ప్రపంచం ముందు ఉంచింది.
దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఫోన్ చేసి వెంటనే కార్గిల్ నుంచి వైదొలగాలని సూచించారు. అనంతరం మన సైన్యం కార్గిల్ సెక్టార్ లో బెబ్బులిగా రెచ్చిపోయి ముష్కర మూకలపై విరుచుకుపడింది. పాక్ ఆక్రమించుకున్న ఒక్కో సెక్టార్ ను తిరిగి స్వాధీనం చేసుకుంటూ పాక్ సైన్యాన్ని తరిమి కొట్టింది. 1999 జూలై 14న ఆపరేషన్ విజయ్ విజయవంతం అయిందని అప్పటి ప్రధాని వాజ్ పేయి ప్రకటించారు. జూలై 26న కార్గిల్ యుద్ధం ముగిసిందని మన సైన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. కార్గిల్ లో భారత విజయానికి గుర్తుగా ప్రతిఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ నిర్వహిస్తున్నారు.
410955 397024It can be tough to write about this topic. I feel you did an exceptional job though! Thanks for this! 963062
900593 305436I discovered your weblog web site on google and examine several of your early posts. Continue to sustain up the superb operate. I merely extra up your RSS feed to my MSN News Reader. In search of forward to reading far more from you later on! 882896
768108 228061This really is a great subject to speak about. Sometimes I fav stuff like this on Redit. I dont believe this would be the very best to submit though. Ill take a look around your internet site though and submit something else. 165562