కరోనా వైరస్, కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారింది. చిన్నా చితకా ఆసుపత్రుల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులదాకా అందినకాడికి దండుకున్నారు కరోనా చికిత్స పేరుతో. రోగులను పీల్చి పిప్పి చేసేశారు. కోటి రూపాయలదాకా కూడా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు గుంజేసినట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం 5 లక్షలు.. గరిష్టంగా 50 లక్షలు ఆ పైన దోచేసిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా కనిపిస్తున్నాయి.
అసలెందుకింతలా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు దోచేస్తున్నాయి.? ఈ ప్రశ్నకు ఓ ప్రముఖ వైద్యుడు (హైద్రాబాద్ నగరంలో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకుడు) చెప్పిన సమాధానం వింటే, ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా. ఎలాంటి వైద్య చికిత్సా అవసరం లేకుండా ఓ వ్యక్తి, కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చి, జస్ట్ ఓ గంట పాటు, ఆసుపత్రిలో చేరి బెడ్ మీద పడుకుంటే.. 20 వేల రూపాయలు ఖర్చవుతుందట. కరెంటు ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు ఇందులో వుంటాయట. షాక్ అవడం కాదు.. మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే ఎవరికైనా.
‘పీత కష్టాలు పీతవి..’ అంటూ సదరు డాక్టరుతో చర్చా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించాడంటే, దోపిడీలో మీడియా సంస్థలకీ వాటా పరోక్షంగా వున్నట్లే కదా. 20 వేల రూపాయలు గంటకి ఎందుకు ఖర్చవుతుంది.? అనే ప్రశ్న సదరు సీనియర్ జర్నలిస్టు నుంచి వచ్చి వుండాలి. ఓ గంటకి ఓ పేషెంటుకి.. పైగా, అసలేమీ అనారోగ్య సమస్య లేని పేషెంటు.. బెడ్ మీద పడుకుని వెళితే 20 వేల రూపాయలు ఖర్చవుతుందా.? ఈ లెక్కన, మందులు వేసి.. వైద్య చికిత్స చేసి, ఒకవేళ ఏ సర్జరీనో జరిగితే ఏంటి పరిస్థితి.? గంటకి 20 వేలు అంటే, రోజుకి 4.8 లక్షలు..
ఎలాంటి అనారోగ్యం లేని వ్యక్తికి. పైన చెప్పుకున్నట్టు సర్జరీ చేస్తే.. దానికి ఐదారు రెట్లైనా వసూలు చెయ్యాలి కదా.? ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు, అనారోగ్యంతో వచ్చే పేషెంట్లను దోచేస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఆసుపత్రులు చేయాల్సింది వైద్యం.. ఆ వైద్యం ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది. కాదు కాదు, ఖరీదైన వ్యాపారంగా మారిపోయింది.
188672 479683Cheers for this excellent. I was wondering in case you were thining of writing related posts to this 1. .Keep up the great articles! 93647
403056 945159What a lovely weblog page. I will definitely be back again. Please maintain writing! 394833