పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ వెలువడినప్పటినుంచీ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్న స్థానం నిజామాబాద్. సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితకు గెలుపు ప్రెస్టీజ్ ఇష్యూగా మారిన ఇందూరు గడ్డపై పోటీ రసవత్తరంగా మారింది. పసుపుతోపాటు ఎర్రజోన్నల రైతులు రెండు నెలలుగా మద్దతుధరకోసం నిరసన తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
పైపెచ్చు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్కు భారీ ర్యాలీగా బయలుదేరిన రైతులపై అమానుషంగా లాఠీచార్జ్ చేసిన ఘటన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. పరిస్థితి గరం గరంగా ఉన్న సమయంలో ఎన్నికలు రావడంతో.. తమ ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు.
షెడ్యూల్ విడుదలకు ముందునుంచే.. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. రైతు సంఘాలన్నీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వీరిని బుజ్జగించేందుకు కవిత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుజ్జగించేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండాపోయింది. దీని ప్రతిఫలమే.. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత 185మంది బరిలో దిగడం.
రైతుల నామినేషన్లు నిజామబాద్లో రాజకీయ వేడి రగిలిస్తున్నాయి. టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని.. కవితకే మరోసారి అవకాశం ఉంటుందనే పరిస్థితి నుంచి మెల్లగా మార్పుమొదలైంది. హెచ్చరించిన రైతులు వెనక్కు తగ్గుతారనుకున్నా అలా జరగలేదు. ఇంతింతై.. వటుడింతై అన్నట్లు రోజు రోజుకూ పదుల సంఖ్యలో నామినేషన్లు పడ్డాయి.
చివరిరోజు వచ్చేసరికి ఇవన్నీ కలిసి 245కు చేరాయి. ఈ నామినేషన్ల ‘నాన్సెన్స్’ వెనక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయని కవిత ఆరోపించారు. మోదీపైనా వారణాసిలో ఇలాగే నామినేషన్లు వేయిస్తామని శపథం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకతే రైతులతో నామినేషన్లు వేయించిందని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ ఏమీ మాట్లాడటం లేదు. వీరిమధ్య గొడవ సంగతి కాసేపు పక్కనపెడతాం. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు.. ఈ నామినేషన్లు, అధికార, ప్రతిపక్షాల మధ్య వ్యూహాత్మక ఎత్తులు ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారాయి.
185 మంది అభ్యర్థులు బరిలో ఉండడం ఖాయం కావడంతో ఎలా ఎన్నిక నిర్వహించాలనేది తలనొప్పిగా మారింది. ఇంతమంది కోసం ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహించలేమని చేతులెత్తేసింది. మరేం చేయాలి? బ్యాలెట్తో ఎలక్షన్లు నిర్వహించడం ఒక్కటే మార్గం. సరే బ్యాలెట్తోనే నిర్వహిద్దాం. 185 పేర్లు ఒక పేపర్లో ఉండాలంటే ఎలా చేయాలి? గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా తలెత్తాయా? అప్పుడేం చేశారు? ఇప్పుడేం చేయాలి? ఇలా చిత్రవిచిత్రమైన ప్రశ్నలతో ఈసీ తలపట్టుకుంది.
రైతులు బెదిరిస్తున్నారు కాబట్టి.. చివరి వరకు చాలా మంది బరినుంచి తప్పుకుంటారని ఈసీ అనుకుంది. కానీ ఈ అనూహ్య పరిస్థితితో నోట్లోంచి మాటలు రాక.. కేంద్ర ఎన్నికల సంఘానికి పరిస్థితిని వెల్లడించింది. సీఈసీ కూడా దీనిపై చర్చలు జరిపి రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
లేదంటే.. నిజామాబాద్ ఎన్నికను వాయిదా వేసి.. కొంచెం టైమ్ తీసుకుని ఎన్నిక నిర్వహించే అవకాశమూ లేకపోలేదు. బ్యాలెట్ పేపర్తోపాటు బ్యాలెట్ బాక్సులను కూడా అదే స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మిషన్ 185ను సమస్యల్లేకుండా పాస్ కావడం ఈసీకి కత్తిమీద సామే. చూద్దాం.. ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో..!
246361 539042Aw, it was a very great post. In notion I would like to devote writing such as this furthermore,?C spending time and specific function to produce a great post?- nonetheless so what can I say?- I waste time alot and never at all appear to obtain 1 thing completed. 506054
882985 978382Reading, watching movies or plays, or related activities that may well bring inspiration. 685411