Switch to English

వైసీపీ వర్సెస్‌ టీడీపీ: ఆంధ్రప్రదేశ్‌ని భ్రష్టుపట్టిస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో వుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో మంచి పాలన వుండాలి.. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. ఇవన్నీ జరగాలంటే, ఇక్కడ రాజకీయం కూడా ప్రశాంతంగా వుండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, రాజకీయ నాయకులకి అవేమీ పట్టడంలేదు.

మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ, టీడీపీ.. ఈ రెండు పార్టీలూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ.. ఎవరు అధికారంలో వున్నా, రాష్ట్రానికి ఒరిగేదేమీ కన్పించడంలేదు. ‘కియా’ పరిశ్రమ రగడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో తీవ్ర అలజడి మొదలయ్యింది. ఈ అలజడికి కారణమెవరు.? అంటే, ప్రధానంగా ఆ రెండు పార్టీలేనని చెప్పాలి. గతంలో ‘కియా’ పరిశ్రమ విషయమై వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఎలాగైతేనేం, టీడీపీ హయాంలోనే కియా పరిశ్రమ ఏర్పడింది. దాన్నిప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసేందుకు వైసీపీ, టీడీపీ సంయుక్తంగా ఓ నాటకానికి తెరలేపాయన్న ప్రచారం జరుగుతోంది.

టీడీపీ తన అనుకూల వర్గాల ద్వారా రాయిటర్‌లో ఓ కథనం రాయించిందనీ, ఇది ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది మరోపక్క, కియా పరిశ్రమ ఏర్పాటుని వైసీపీ మొదటినుంచీ వ్యతిరేకిస్తోందనీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ సంస్థను వైసీపీ నేతలే బెదిరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ ఆరోపణలు చూస్తే.. రెండింటిలోనూ కాస్తో కూస్తో వాస్తవాలు కన్పించకమానవు.

ఇదిలా వుంటే, విశాఖ మిలీనియం టవర్స్‌లో ఐటీ సంస్థలకు ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్ళాయంటూ సోషల్‌ మీడియాలో కొత్త రచ్చ షురూ అయ్యింది. అక్కడ ప్రభుత్వం, సచివాలయం ఏర్పాటు చేయాలనుకుంటోంది గనుక, ఇప్పటికే అక్కడున్న కార్యాలయాలకు ఈ నోటీసులు అందాయన్నది ఆ రచ్చ తాలూకు సారాంశం. ఆదాని డాటా సెంటర్‌ విశాఖకు రాకుండా పోయిందెందుకు.? ప్రతిష్టాత్మక లులు సంస్థకు భూముల కేటాయింపు ఎందుకు రద్దయ్యింది.? ఇవన్నీ ఒక్కసారి పరిశీలిస్తే.. రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా టీడీపీ – వైసీపీలకు ఒకరి మీద ఒకరు రాజకీయ బురద జల్లుకోవడమే ముఖ్యమన్న విషయం అర్థమవుతోంది.

ప్రస్తుతానికి కియా వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కన్పిస్తున్నా.. ఏమో, రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ వాతావరణం కారణంగా రేపు జరగరానిది ఏదన్నా జరిగితే, దానికి నైతిక బాధ్యత వహించాల్సింది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైసీపీ, రాష్ట్రంలో ప్రతిపక్షంగా వున్న టీడీపీలే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...