ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో వుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో మంచి పాలన వుండాలి.. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. ఇవన్నీ జరగాలంటే, ఇక్కడ రాజకీయం కూడా ప్రశాంతంగా వుండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, రాజకీయ నాయకులకి అవేమీ పట్టడంలేదు.
మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ, టీడీపీ.. ఈ రెండు పార్టీలూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేస్తున్నాయి. 2014 నుంచి 2019 వరకు టీడీపీ, ఇప్పుడు వైఎస్సార్సీపీ.. ఎవరు అధికారంలో వున్నా, రాష్ట్రానికి ఒరిగేదేమీ కన్పించడంలేదు. ‘కియా’ పరిశ్రమ రగడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో తీవ్ర అలజడి మొదలయ్యింది. ఈ అలజడికి కారణమెవరు.? అంటే, ప్రధానంగా ఆ రెండు పార్టీలేనని చెప్పాలి. గతంలో ‘కియా’ పరిశ్రమ విషయమై వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఎలాగైతేనేం, టీడీపీ హయాంలోనే కియా పరిశ్రమ ఏర్పడింది. దాన్నిప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసేందుకు వైసీపీ, టీడీపీ సంయుక్తంగా ఓ నాటకానికి తెరలేపాయన్న ప్రచారం జరుగుతోంది.
టీడీపీ తన అనుకూల వర్గాల ద్వారా రాయిటర్లో ఓ కథనం రాయించిందనీ, ఇది ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది మరోపక్క, కియా పరిశ్రమ ఏర్పాటుని వైసీపీ మొదటినుంచీ వ్యతిరేకిస్తోందనీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ సంస్థను వైసీపీ నేతలే బెదిరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ ఆరోపణలు చూస్తే.. రెండింటిలోనూ కాస్తో కూస్తో వాస్తవాలు కన్పించకమానవు.
ఇదిలా వుంటే, విశాఖ మిలీనియం టవర్స్లో ఐటీ సంస్థలకు ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్ళాయంటూ సోషల్ మీడియాలో కొత్త రచ్చ షురూ అయ్యింది. అక్కడ ప్రభుత్వం, సచివాలయం ఏర్పాటు చేయాలనుకుంటోంది గనుక, ఇప్పటికే అక్కడున్న కార్యాలయాలకు ఈ నోటీసులు అందాయన్నది ఆ రచ్చ తాలూకు సారాంశం. ఆదాని డాటా సెంటర్ విశాఖకు రాకుండా పోయిందెందుకు.? ప్రతిష్టాత్మక లులు సంస్థకు భూముల కేటాయింపు ఎందుకు రద్దయ్యింది.? ఇవన్నీ ఒక్కసారి పరిశీలిస్తే.. రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా టీడీపీ – వైసీపీలకు ఒకరి మీద ఒకరు రాజకీయ బురద జల్లుకోవడమే ముఖ్యమన్న విషయం అర్థమవుతోంది.
ప్రస్తుతానికి కియా వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కన్పిస్తున్నా.. ఏమో, రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ వాతావరణం కారణంగా రేపు జరగరానిది ఏదన్నా జరిగితే, దానికి నైతిక బాధ్యత వహించాల్సింది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైసీపీ, రాష్ట్రంలో ప్రతిపక్షంగా వున్న టీడీపీలే.
572874 428535extremely good post, i definitely enjoy this remarkable website, persist with it 66677