ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కసరత్తుపై వైసీపీ స్పీడ్ పెంచింది. స్వల్ప మార్పులతో ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేసిన ఆ పార్టీ.. తాజాగా 27 మందితో కూడిన రెండో జాబితాని ప్రకటించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని లని పక్కనపెట్టి తిరుపతి, చంద్రగిరి, మచిలీపట్నం నియోజకవర్గాల పగ్గాలను వారి కొడుకులకు అప్పగించింది. రీజినల్ కోఆర్డినేటర్స్ తో సంప్రదించిన చర్చించిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ జాబితాని ఖరారు చేశారు. ఇప్పటికే 11 మంది ఇన్చార్జిలను మార్చగా తాజాగా మరో 27 మందిని మార్చి మొత్తంగా 38 మంది ఇన్చార్జిలను నియమించింది.
తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, పిఠాపురం వంగ గీత, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, పత్తిపాడు వరపుల సుబ్బారావు, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, రామచంద్రపురం పిల్లి సూర్య ప్రకాష్, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, రాజాం తాళ్ల రాజేష్, అనకాపల్లి మలకాల భరత్ కుమార్, పాయకరావుపేట కంబాల జోగులు, పి గన్నవరం వేణుగోపాల్, రాజమండ్రి రూరల్ చెల్లిబోయిన వేణు, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి మక్బూల్ అహ్మద్, పెనుకొండ కె.వి ఉషా చరణ్, కల్యాణదుర్గం తలారి రంగయ్య, అరకు (ఎస్టి) గొడ్డేటి మాధవి, పాడేరు (ఎస్టి) మత్స్యరాస విశ్వేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, జగ్గంపేట తోట నరసింహం, ఎర్రగొండపాలెం (ఎస్సీ) తాడిపత్రి చంద్రశేఖర్, ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్, గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా, అనంతపురం పార్లమెంట్ మాల గుండ్ల శంకర్ నారాయణ, హిందూపురం పార్లమెంట్ జూలదరాశి శాంత, అరకు పార్లమెంట్ (ఎస్టి) కొట్టగుల్లి భాగ్యలక్ష్మి లను నియమించింది. నెల్లూరు జిల్లా లోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం విషయంలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో అక్కడ ఎవరినీ నియమించలేదు.
Hmm it seems like your blog ate my first comment (it was extremely long) so I guess I’ll just sum it up what I had written and
say, I’m thoroughly enjoying your blog. I too am an aspiring
blog writer but I’m still new to everything. Do you have
any suggestions for rookie blog writers? I’d genuinely
appreciate it.