తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే కోలుకొని విధంగా దెబ్బపడింది. వరస దెబ్బలతో బిక్కుబిక్కుమంటోంది. మూడు రాజధానులను అడ్డుకోవాలని చూసినా కుదరలేదు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నది. ఈ బలాన్ని ఉపయోగించుకొని మూడు రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకోవడమే కాకుండా, సెలక్ట్ కమిటీకి బిల్లును పంపించడంతో వైకాపా ప్రభుత్వం కక్షకట్టి ఏకంగా మండలిని రద్దుకు తీర్మానం పెట్టింది. ప్రస్తుతం రద్దు విషయం కేంద్రం కోర్టులో ఉన్నది.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మరింతగా అణగదొక్కేందుకు మరో ఎత్తును సిద్ధం చేసుకుంది వైకాపా. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసే సమయంలో తాము అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కృష్ణా జిల్లా ఇప్పుడు రెండు జిల్లాలుగా మారబోతున్నది.
మంచిలిపట్నంను కొత్తజిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం గుడివాడ మచిలీపట్నం జిల్లాలో భాగం కాబోతున్నది. అయితే, మచిలీపట్నం పేరును అలానే ఉంచుతారా లేదంటే ఎన్టీఆర్ జిల్లాగా మారుస్తారా చూడాలి. పాదయాత్ర సమయంలో కృష్ణా జిల్లా అన్నారు కాబట్టి కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా మారిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతమైన నిమ్మకూరు మచిలీపట్నంజిల్లాలో ఉంటుంది. ఒకవేళ మచిలీపట్నం ను ఎన్టీఆర్ జిల్లాగా మారిస్తే జగన్ కు తిరుగుండదు. తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ పడుతుంది. అలా కాకుండా ఇచ్చిన హామీని పక్కన పెడితే అది తెలుగుదేశం పార్టీకి ఆయుధంగా మారుతుంది. దీనిని ఉపయోగించుకొని వైకాపాపై విరుచుకుపడే అవకాశం ఉంటుంది.
703725 835395As soon as I discovered this internet site I went on reddit to share some of the love with them. 638460
119101 664180Most what i read online is trash and copy paste but i feel you offer something different. Keep it like this. 440379
414680 198561I like this web weblog quite a lot so a lot superb information . 644979
748567 741286I adore your wp internet template, wherever would you obtain it via? 313331
419739 647616A lot of thanks for this specific info I was basically browsing all Search engines to discover it! 281068