Switch to English

టీడీపీ వర్సెస్‌ వైసీపీ: ఎన్నాళ్ళీ శవ రాజకీయాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌.. మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. రాయలసీమకి ఫ్యాక్షన్‌ రాజకీయ హత్యలు కొత్తేమీ కాదు. ఇది కూడా ఆ కోవలో జరిగిన హత్యగానే చూడాలేమో.!

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఈ హత్యకు కారకుడన్నది మృతుడి భార్య ఆరోపణ. ఈ మేరకు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు కూడా. అయితే, పోలీసులు మాత్రం, ఎమ్మెల్యే పేరుని తెలివిగా ఎఫ్‌ఐఆర్‌లో లేకుండా జాగ్రత్తపడ్డారన్న విమర్శలున్నాయి. నారా లోకేష్‌, బాధిత కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో.. హైడ్రామా నడిచింది. ఎమ్మెల్యే పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చకపోతే, మృతదేహాన్ని అక్కడి నుంచి కదలనీయబోమంటూ అటు బాధిత కుటుంబం, ఇటు నారా లోకేష్‌ భీష్మించుక్కూర్చున్నారు.

పోలీసులు చేసేది లేక, బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినందున, కోర్టు అనుమతితో ఎమ్మెల్యే పేరుని నిందితుల లిస్ట్‌లో చేర్చుతామని హామీ ఇచ్చారట పోలీసులు. నిజానికి, వైసీపీ హయాంలో పోలీసులు ఆయా కేసుల విచారణకు సంబంధించి వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ ఎమ్మెల్యే, ఓ మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడితే, ముందుగా కేసు నమోదు చేసింది బాధిత మాజీ ఎమ్మెల్యే మీద. ఆ తర్వాత బాధిత మాజీ ఎమ్మెల్యే తన ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన ఆధారాల్ని వీడియోల రూపంలో పంపించాక, పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాక, అధికార పార్టీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేస్తోందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

చంద్రబాబు హయాంలో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోయింది అప్పటి ప్రతిపక్ష నేతకి. ఇప్పుడు ప్రతిపక్షం టీడీపీకి, పోలీసుల మీద నమ్మకం లేకుండా చేస్తోంది వైసీపీ. పెద్దగా తేడా ఏం లేదు. ఇక, శవ రాజకీయాల విషయానికొస్తే, ఇలాంటివి చంద్రబాబు హయాంలో వైసీపీ చాలానే చేసింది. అంతిమంగా రాష్ట్రంలో నేరాలు ఘోరాలు మాత్రం విపరీతంగా పెరిగిపోతూనే వున్నాయి.. కింది స్థాయి నేతలు ఈ రాజకీయ పార్టీల్ని నమ్ముకుని ప్రాణాలు కోల్పోతున్నారంతే. ప్రొద్దుటూరు ఘటనలో మృతి చెందిన సుబ్బయ్య గతంలో వైసీపీ నేత కావడం గమనార్హం.

4 COMMENTS

  1. We invite you to engage, discuss, and share your thoughts with fellow knowledge seekers about Magic mushroom. By fostering an environment of collaborative learning and open dialogue, we believe that the appreciation for information grows exponentially. Our dedication to staying current ensures that we are always exposed to your latest insights, trends, and breakthroughs. From cutting-edge research to timeless classics, we curate content that spans the spectrum of human knowledge.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...