‘దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం దుర్మార్గం.. ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి ఘటనల్ని ఉపేక్షించకూడదు. పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఈ దాడులకు పాల్పడేవారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు..’ ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి, తాజాగా ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యల సారాంశం.
కానీ, ముఖ్యమంత్రి హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దుండుగులో ఓ దేవాలయంలోకి చొరబడి, దేవతామూర్తుల విగ్రహాల్ని ధ్వంసం చేశారు. ఎందుకిలా జరుగుతోంది. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో దేవాలయాలపై దాడులు జరగడంలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం, హిందూమతంపై కుట్రపూరితమైన దాడి జరుగుతూనే వుంది గత కొంతకాలంగా.
ఇతర రాష్ట్రాల్లోనూ ప్రముఖ దేవాలయాలున్నాయి.. అక్కడా దేవుళ్ళ రధాలున్నాయి. అక్కడెక్కడా దేవాలయాలపై దాడులు జరగడంలేదు.. రధాలు తగలబడటంలేదు. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో.? ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ‘విరిగింది బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అంటాడో అధికార పార్టీ నాయకుడు. పైగా, ఆయన బాధ్యతగల మంత్రి పదవిలో వున్నాడు. ‘నేనూ హిందువునే..’ అని చెప్పుకుంటాడుగానీ, ఏ హిందువు అయినా, దేవతా మూర్తుల విగ్రహాన్ని ‘బొమ్మ’ అని అనగలడా.? ఇక్కడే, అధికార పార్టీ నేతల డొల్లతనం బయటపడుతోంది.
కీలక పదవుల్లో వుండి మరీ, హిందూ మతాన్ని గేలి చేయడం.. ఈ తరహా దాడులకు మరింత ప్రోత్సాహిన్నిస్తున్నట్టుంది. ఇంకో మంత్రి, తిరుమల కొండ మీద నుంచి ‘హ్యాపీ క్రిస్మస్’ అని క్రిస్టియన్లకు శుభాకాంక్షలు చెబుతాడు. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింకు లేని వ్యవహారాలని ఎలా అనుకోగలం.? చర్చిల నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ.. మైనార్టీ వర్గానికి చెందినవారు పోలీస్ స్టేషన్లపై దాడులు దిగినా, వారిపై కేసుల్ని ఎత్తేసేంత గొప్ప హృదయం అధికార పార్టీ నేతలకు వుంది.
దురదృష్టవశాత్తూ, ఆ బాధ్యత హిందూ మత విశ్వాసాల్ని కాపాడటంలో లేకపోవడమే అత్యంత బాధాకరమైన విషయం. రాష్ట్రంలో రెండో అతి పెద్ద రామాలయం విజయనగరం జిల్లా రామతీర్థంలో వుంది. అక్కడే, రాములోరి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. ఇది చిన్న ఘటనగా ఎలా కొట్టి పారేయగలం.? రాష్ట్రంలో ప్రముఖమైన దేవాలయాల్లో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి. ఆ దేవాలయం తాలూకు రధాన్ని తగలబెట్టేశారు కొందరు దుండగులు.
రాష్ట్రంలో రెండో అతి పెద్ద పుణ్యక్షేత్రం బెజవాడ దుర్గమ్మ దేవాలయం. ఆ దేవాలయం తాలూకు రధానికి చెందిన వెండి సింహాల్ని కొందరు దొంగిలించారు. చెప్పుకుంటూ పోతే, ఒకటా.? రెండా.? లెక్కలేనన్ని ఘటనలు, హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాయి. ముఖ్యమంత్రి ఆదేశాల్ని అధికారులు పట్టించుకోవడంలేదా.? లేదంటే, ఈ తరహా దాడులకు పాల్పడుతున్నవారికి అధికార పార్టీ అండదండలున్నాయా.? అందుకే పోలీసులు మిన్నకుండిపోతున్నారా.? అన్నది తేలాల్సి వుంది.
రాజకీయ నాయకుల విగ్రహాలు ధ్వంసమైతేనో, సోషల్ మీడియాలో ఫొటోల్ని మార్ఫింగ్ చేస్తేనో.. అప్పటికప్పుడు కేసులు పెట్టి, రాత్రికి రాత్రి నెటిజన్లను అరెస్ట్ చేస్తోన్న పోలీసు యంత్రాంగం, అంతర్వేది ఘటనపైనా, బెజవాడ దుర్గమ్మ వెండి సింహాల ఘటనపైనా.. ఇంతవరకు ఎందుకు దోషుల్ని పట్టుకోలేకపోయినట్టు.?
261253 415387My brother suggested I would possibly like this blog. He was once entirely right. This submit in fact made my day. You cant believe just how so much time I had spent for this data! Thank you! 896278