Switch to English

జనసేనాని మీద ఏడుపా.? బులుగు పేమెంట్ లేకపోతే రాత కూడా పెగలదు మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

స్క్రిప్ట్ లేకుండా పవర్ స్టార్‌కి మాట పెగలదంతే.. అంటూ బులుగు మీడియా తన పైత్యాన్నంతా చాటుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో జనసేన అధినేత భేటీపై యజమాని కన్నా ఎక్కువగా బాధపడిపోతోంది బులుగు మీడియా.! ఎందుకింత ఏడుపు.? పేమెంట్ లేకపోతే రాత పెగలని వాళ్ళు కూడా, జనసేన అధినేత మీద విమర్శనాత్మక కథనాల్ని ప్రచారంలోకి తీసుకురావడం హాస్యాస్పదం కాక మరేమిటి.?

ప్రధాని భీమవరం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానమే లేదంటూ అప్పట్లో ఇదే నీలి మీడియా, సిగ్గులేని రాతల్ని తెరపైకి తెచ్చింది. పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం అందింది.. కానీ, ఆయనే వెళ్ళలేదని తెలిసి నాలుక కరచుకుంది. ఇప్పుడేమో, ప్రధాని కార్యాలయం నుంచే జనసేన అధినేతకు ఆహ్వానం వచ్చింది.. హైద్రాబాద్ నుంచి విశాఖ వెళ్ళి, ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

అంతే, బులుగు మీడియా గుండెల్లో రాయి పడిపోయింది. తమ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో.. ప్రభుత్వం కూలిపోతే, ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో దోచేసే అవకాశం కోల్పోతామనే అక్కసుతో జనసేనాని మీద నిస్సిగ్గు రాతలు షురూ చేసింది.

పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి స్క్రిప్టు కావాలా.? అలా అనాలంటే ఎంతటి అవివేకం వుండాలి.? అత్యంత నీఛ స్థితికి దిగజారిపోతేనే ఇలాంటి ఆలోచన వస్తుంది ఎవరికైనా. ప్రధానితో బేటీ తర్వాత పవన్ కళ్యాణ్ మొహంలో నవ్వు మాయమైపోయిందట.. ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్‌కి క్లాస్ తీసుకున్నారట.. పవన్ కళ్యాణ్ ఎరక్కపోయి ఇరుక్కున్నారట.. మీటింగు ఒకరితోనూ, డేటింగు ఇంకొకరితోనట.. అదేదో ఏనుగు సామెత అట.. వామ్మో.. తమను పోషిస్తోన్న బులుగు పార్టీ గురించి పాజిటివ్‌గా అయినా ఒకే రోజు ఇన్ని కథనాల్ని తెరపైకి తీసుకు రాదేమో బులుగు మీడియా.

ఒకరకంగా చెప్పాలంటే, వీళ్ళందరికీ ‘తిండి’ దొరుకుతున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణంగానే. మామూలుగా అయితే, అన్నదాతా సుఖీభవ.. అనాలి. కానీ, పవన్ కళ్యాణ్ మీద ఏడిస్తే తప్ప, వీళ్ళకి తిండి దొరకదు గనుక.. సుఖీభవ అనలేని రుగ్మత సోకాల్డ్ బులుగు మీడియాకి వచ్చిపడింది.

ప్రధాని మోడీకి చెప్పాలనుకున్నది పవన్ కళ్యాణ్ చెప్పేశారు. మోడీ నుంచి రావాల్సిన సమాధానం జనసేనానికి వచ్చింది. ‘మంచి రోజులు రాబోతున్నాయ్’ అన్న ఒక్క మాటలోనే చాలా అర్థం వుంది. అది అర్థమైతే అది బులుగు మీడియా ఎందుకు అవుతుంది.? అర్థమయినా, అర్థం కానట్లే నటించాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...