Switch to English

ఉద్యోగులే బలి పశువులు.. ప్రభుత్వం ఇంతకన్నా ఏం చేయగలదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆర్థిక శాఖకు సంబంధించి ‘విలువైన సమాచారం’ బహిర్గతమయ్యిందంటూ, కొందరు ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. చాలా చిత్రమైన సందర్భమిది. ఉద్యోగులు తప్పు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి వుంది. మరి, ప్రభుత్వమే తప్పు చేస్తేనో.? అదంతే, శిక్షించడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలకు తేరగా దొరుకుతారు మరి. నచ్చినట్టు పనిచేస్తే ప్రమోషన్లు.. నచ్చకపోతే బదిలీలు, సస్పెన్షన్లు కూడా. అందుకే, పోలీసు వ్యవస్థలోనూ కొందరు అధికారులు, నిబంధనలకు నీళ్ళొదిలి, కేవలం అధికార పార్టీ రాసుకున్న రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాంటివారికి న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడుతున్నా, మార్పు రావడంలేదు.

ఇక, రాష్ట్రంలో అప్పుల విషయానికొద్దాం. చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులపై గోల చేసిన, చేస్తున్న వైసీపీ, తాము అధికారంలోకి వచ్చాక చేస్తున్న అప్పుల్ని సమర్థించుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన, ప్రతిపక్షంలో వున్నప్పుడు అప్పుల్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆ అప్పుల భారం మోయాల్సింది ప్రజలేనన్నారు. మరిప్పుడు, జగన్ ప్రభుత్వం చేసే అప్పుల భారాన్ని ఎవరు మోయాలట.? సంక్షేమ పథకాలు, వాటి పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తున్న సొమ్ములు.. వీటన్నిటికీ అసలు మరియు వడ్డీ కట్టాల్సింది ప్రజలే.

ఓ చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో లాక్కోవడమెలాగో ప్రభుత్వాలకి తెలుసు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇందుకు అతీతమేమీ కాదు. నిజానికి, అప్పుల్లో రహస్యమేమీ లేదని జగన్ సర్కారే చెబుతోంది. అలాంటప్పుడు, అప్పులకు సంబంధించిన విలువైన సమాచారం అధికారుల ద్వారా లీక్ అయ్యిందని ఆరోపిస్తూ, సదరు అధికారుల్ని తొలగించడమేంటి.? అంటే, ఎక్కడో జరగకూడనిది జరుగుతోందన్నమాట. ఆ విషయం బయటకు పొక్కిందనే అధికారుల మీద చర్యలు చేపట్టారన్నమాట.

అయినా, సొంత పార్టీకి సంబంధించి చాలా విషయాల్ని లీక్ చేస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సస్పెన్షన్ వేటు వేయలేని అధికార పార్టీ, ఉద్యోగుల మీద జులుం ప్రదర్శిస్తే ఎలా.? అన్నది ఉద్యోగ సంఘాల నేతల ప్రశ్న. ఉద్యోగ సంఘాల నేతల్లోనూ కొందరు అధికార పార్టీకి అమ్ముడుపోవడంతోనే, ఉద్యోగులకు జరుగుతున్న నష్టంపై ప్రశ్నించలేకపోతున్నారన్న విమర్శలు లేకపోలేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...