‘ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి రాజధాని అమరావతి ప్రాజెక్టుని నిర్మించలేం..’ అంటోంది వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం. నిజానికి, రాజధాని అనేది రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. ‘నీది ఏ రాష్ట్రం.? నీ రాష్ట్రానికి రాజధాని ఏది.?’ అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని దుస్థితి రావడమంటే అంతకన్నా అవమానం ఇంకోటుండదు ఎవరికైనా.
దురదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అవేమీ పట్టడంలేదు. ఏడు నెలలుగా రాష్ట్ర రాజధాని విషయమై తీవ్ర గందరగోళం నెలకొంది. విశాఖపట్నంకి రాజధాని తరలిపోతుందని ఓ మంత్రి చెబుతారు.. ఇంకొకాయనేమో, రాష్ట్రానికి మూడు రాజధానులొస్తాయని చెబుతారు. అసలేం జరుగుతోంది రాష్ట్రంలో.!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి హైద్రాబాద్లోనూ, బెంగళూరులోనూ, పులివెందులలోనూ, అమరావతిలోనూ ఇళ్ళు వుండొచ్చుగాక. అది ఆయన వ్యక్తిగతం. రాష్ట్రం పరిస్థితి వేరు. రాష్ట్ర ప్రజల పరిస్థితి వేరు. గడచిన ఏడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రకటనల కోసం’ వందల కోట్లు ఖర్చు చేసింది.. చేస్తోంది కూడా.!
ప్రభుత్వ కార్యాలయాలకీ, స్మశానాలకీ, చెట్లకీ, టాయిలెట్లకీ వైసీపీ జెండా రంగులు వేయడానికే వందల కోట్లు.. వేల కోట్లు ఖర్చవుతున్నాయి. కానీ, రాజధాని అమరావతి నిర్మాణానికి మాత్రం డబ్బులు ప్రభుత్వం వద్ద లేవట. ఇదెక్కడి విడ్డూరం. చంద్రబాబు హయాంలో లక్ష కోట్లతో రాజధాని అమరావతి ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. అంత ఖర్చు నచ్చకపోతే, ఓ పది వేల కోట్లతో కట్టొచ్చు.. అదీ చేతకాకపోతే, ‘మా స్టామినా ఇంతే’ అంటూ ఓ ఐదు వేల కోట్లతో సరిపెట్టుకోవచ్చుగాక. అంతేగానీ, రాజధానికి ఖర్చుచేయలేం కాబట్టి, తరలించేస్తామనంటే ఎలా కుదురుతుంది.?
చూస్తోంటే, రాజధాని వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ‘చిన్న పిల్లలాట’లా కన్పిస్తున్నట్టుంది. రాజన్న రాజ్యమంటే, వున్న రాజధానిని చెడగొట్టడమని అర్థం చేసుకోలేకపోయారు పాపం రాష్ట్ర ప్రజలు.
110974 507766Thank you a lot for sharing this with all people you actually recognize what youre speaking about! Bookmarked. Please additionally speak more than with my internet website =). We could have a hyperlink alternate arrangement among us! 559114
388832 227058I believe other site owners really should take this internet site as an model, extremely clean and superb user genial style and style . 529426