ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దు.. అని గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నినదిస్తే, దాన్ని తీవ్రంగా తప్పు పట్టారు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం ‘హోదా’ వద్దు, ప్యాకేజీనే ముద్దు.. అంటోంది. అయితే, ఇది రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కాదు. అమరావతిలో రైతుల హోదా గురించి.
రాజధాని కోసం భూముల్ని ఇచ్చిన రైతాంగానికి, వైఎస్ జగన్ సర్కార్ ‘ప్యాకేజీని’ ఇస్తామంటోంది. అమరావతికి ప్రస్తుత పరిస్థితుల్లో 33 వేల ఎకరాలు అవసరం లేదనీ, రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి వారికే ఇచ్చేస్తామనీ, ఈ క్రమంలో మంచి ప్యాకేజీ వారికి అందిస్తామనీ సాక్షాత్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెలవిచ్చారు.
‘మేం రాజధాని కోసం భూముల్ని త్యాగం చేశాం..’ అనే గొప్ప అనుభూతిని రైతులు పొందుతూ వచ్చారు. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా వర్ధిల్లుతుందనీ, తమ భూముల్లో నిర్మితమయ్యే ఆ మహానగరాన్ని కళ్ళారా చూడాలని రైతులు ఆశపడుతూ వచ్చారు. కానీ, వారి ఆశల్ని వైఎస్ జగన్ సర్కార్ తుంచేసింది. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.
అమరావతి నుంచి విశాఖపట్నంకు రాజధాని తరలింపు దాదాపు ఖాయమైపోయిన విషయం విదితమే. ‘అప్పుడు ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ అలా మాట్లాడారు.. ప్యాకేజీని బిచ్చంతో పోల్చారు.. మరిప్పుడు, మాకు ప్యాకేజీ ఇస్తామని చెప్పడమేంటి.? మాకు బిచ్చమేయాలనుకుంటోందా జగన్ ప్రభుత్వం.?’ అంటూ రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు.
ఒక్కటి మాత్రం నిజం.. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు తీవ్ర అవమానభారానికి గురవుతున్నారు ప్రభుత్వం కారణంగా. మంత్రులు, అధికార పార్టీ ముఖ్య నేతలు, రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తోన్న విషయం విదితమే.
60849 852641Hello, Neat post. There is actually a issue with your website in internet explorer, could test thisK IE nonetheless is the marketplace leader and a large portion of people will leave out your superb writing due to this issue. 135814
909911 389845I actually like your writing style, good info , thankyou for putting up : D. 772853
332630 461301Nicely written articles like yours renews my faith in todays writers. Youve written information I can finally agree on and use. Thank you for sharing. 823453