నాకు మీడియా లేదు.. నేను మీ బిడ్డని.. పేదలకీ.. పెత్తందార్లకీ మధ్య జరుగుతున్న యుద్ధం.! గత కొంతకాలంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ బహిరంగ సభల్లో.. అదీ అధికారిక బహిరంగ సభల్లో చేస్తున్న ఈ వ్యాఖ్యల వ్యవహారం.. పెద్ద రాజకీయ దుమారానికి కారణమవుతోంది.
కోట్లకు అధిపతి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కాదు కాదు, వందల వేల కోట్లకు అధిపతి అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘పేదలకీ పెత్తందార్లకీ మధ్యన జరుగుతున్న యుద్ధం’ అని అనొచ్చా.? వేల కోట్లు కాదు, లక్షల కోట్లు.. అంటారు కొందరు. వేల కోట్ల వరకూ అయితే లెక్కలు స్పష్టంగానే కనిపిస్తున్నాయ్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యం అలాంటిది.
ఇక, అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలంటూ గత కొద్ది రోజులుగా వైసీపీ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.! అదేంటీ, అమరావతిని స్మశానమన్నారు కదా.. ముంపు ప్రాంతమన్నారు కదా.. ఎడారిగానూ అభివర్ణించారు కదా.. అన్నటికీ మించి, కమ్మరావతి.. అని కూడా అన్నారు కదా.? ఇప్పుడు ఈ పేదల పేరుతో పబ్లసిటీ స్టంట్లు ఏంటబ్బా.?
ఒకటా.? రెండా.? సవాలక్ష సమస్యలు అధికార పార్టీని వెంటాడుతున్నాయి.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సహా.. చాలా వ్యవహారాలన్నమాట.! ఈ నేపథ్యంలో డైవర్షన్ రాజకీయానికి వైసీపీ తెరలేపింది. ఈ క్రమంలోనే పేదలు – పెత్తందార్లు.. అంటూ కొత్త వాదనకు తెరలేపారు.
సాక్షి మీడియా ఎవరిది.? బెంగళూరు, హైద్రాబాద్లలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వున్న భవంతుల సంగతేంటి.? అమరావతిలో కట్టుకున్న రాజమహల్, పులివెందులలో భవంతులు.. ఇవన్నీ పెట్టుకుని, వైఎస్ జగన్ అలా ఎలా మాట్లాడగలుగుతున్నారబ్బా.?