Switch to English

జగన్‌ సర్కార్‌ వర్సెస్‌ ఎస్‌ఈసీ: నిమ్మగడ్డ కోర్టు ధిక్కరణ పిటిషన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికీ మధ్య ‘గ్యాప్‌’ పెరిగిపోతూ వస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆ పదవిలో వున్నంతవరకూ స్థానిక ఎన్నికలు జరగనీయకూడదన్న పట్టుదలతో వుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. ఈ క్రమంలో చాలా కుంటి సాకుల్ని తెరపైకి తెస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

మరోపక్క, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించేయాలన్న పట్టుదలతో వున్నారు. కరోనా కారణంగా గత మార్చి నెలలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన విషయం విదితమే. అప్పటినుంచి ఇప్పటిదాకా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదు.

ఇటీవల, రాష్ట్రంలోని వివిద రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, స్థానిక ఎన్నికల విషయమై అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది కూడా. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిమ్మగడ్డ సంప్రదించడంలేదని అధికార పార్టీ చెబుతుండగా, నిమ్మగడ్డ మాత్రం.. సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే వున్నారు. అయినాగానీ, తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదన్నది నిమ్మగడ్డ ఆరోపణ.

కోర్టు చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి సహకరించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ‘ఎన్నికల కమిషన్‌ లేఖ రాసినా ప్రభుత్వం స్పందించడంలేదు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి స్పందన సరిగా లేదు.. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రభుత్వానికి దేశాలు ఇవ్వండి..’ అంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

అయితే, నిమ్మగడ్డ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేది లేదనీ, వేసవి కాలంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని పలువురు మంత్రులు ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం విదితమే. ఇంతకీ, కోర్టు ఎలా స్పందిస్తుంది.? ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, సానుకూల స్పందనను న్యాయస్థానం నుంచి పొందగలరా.? వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...