‘నాకు మూడు పెళ్ళిళ్ళు జరిగాయి.. రెండు విడాకులూ జరిగాయి..’ అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెబుతోంటే, ‘నలుగురు నలుగురు పెళ్ళాలు..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక వేదికలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారాయె. ఈ క్రమంలో ‘నా నాలుగో పెళ్ళాం నువ్వే.. రా జగన్..’ అంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. అయినాగానీ, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన ఆపడంలేదు.
మీడియాకెక్కి మరీ కొందరు వైసీపీ నేతలు, అందునా అధికార ప్రతినిథులు.. ఇంకా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో, ‘నాలుగో పెళ్ళాం జగన్ మోహిని ఏం చేస్తోంది.?’ అంటూ జనసేన నేతలు కౌంటర్ ఎటాక్ ఇవ్వాల్సి వస్తోంది.
దీనికి తోడు, టీడీపీ – జనసేన పొత్తు గురించి వైసీపీ గింజుకుంటున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. వైనాట్ 175 అని చెప్పుకుంటూ, టీడీపీ – జనసేన పొత్తు మీద పడి ఏడవడమేంటి.? అని వైసీపీ మీద జనం సెటైర్లు వేసుకుంటున్నారు.
నేడో రేపో బీజేపీ కూడా టీడీపీ – జనసేన కూటమిలోకి వస్తే రావొచ్చు. అదే జరిగితే, ఆ తర్వాత వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైపోతుంది. ప్రస్తుతానికైతే గ్రామ స్థాయిలో వైసీపీ దీన స్థితికి ఆ పార్టీ నాయకులే కకా వికలమవుతున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాదు.. మంత్రులూ వైసీపీలో వుండలేక, పార్టీలు మారుతున్న పరిస్థితి. ‘పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి పదే పదే వైఎస్ జగన్ మాట్లాడటం వైసీపీలోనే చాలామందికి నచ్చడంలేదు. వైసీపీ అధినాయకత్వం తీరు పట్ల చాలామంది అసంతృప్తితో వున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే, వైసీపీలో ఎవరూ మిగలరు..’ అని పార్టీ మారుతున్న నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
మిగతా విషయాలెలా వున్నా, ‘నాలుగో పెళ్ళాం’ అంశం జనంలోకి బాగా వెళ్ళిపోయింది. ఎక్కడ విన్నా ఇదే చర్చ.! వైఎస్ జగన్ తన పతనాన్ని తానే కోరు తెచ్చుకున్నారని రచ్చబండల సాక్షిగా చర్చ జరుగుతోంది జనంలో.