అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నేతల దాడిలో టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున, కాంట్రాక్టర్ మల్లికార్జున రెడ్డితోపాటు విలేకరులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. తాడిపత్రి పట్టణం నుంచి వెళ్లే ఒక భూగర్భ డ్రైనేజీ పైపులైన్ మరమ్మతులకు గురైంది. 2లక్షలు ఖర్చయ్యే పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్ మల్లికార్జున రెడ్డికి పనులు అప్పగించారు.
అయితే.. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు, 31వ వార్డు కౌన్సిలర్ కేతిరెడ్డి హర్షవర్ఢన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అనుచరులతో అక్కడకు చేరుకున్న హర్షవర్ధన్ వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరులపై ఆయనతోపాటు వైసీపీ నేతలు కూడా దాడికి పాల్పడ్డారు. దాడిలో టీడీపీ కౌన్సిలర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఓ విలేకరికి చెవి దెబ్బతిని వినికిడి శక్తి కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వీరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.
504403 309345Significant other, this superb internet site is fabolous, i merely adore it 739814
591759 991548This plot doesnt reveal itself; it has to be explained. 850285
940445 633598Its difficult to acquire knowledgeable individuals about this subject, and you sound like what happens youre speaking about! Thanks 311685