సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఓ మహిళ అనే వార్త వైరల్ అయింది. ఈజిప్టులో తొలి మహిళా నౌకా కెప్టెన్గా రికార్డు సృష్టించిన ‘మార్వా ఎల్సెలెహదార్’పై ఓ వార్త ప్రపంచాన్ని చుట్టేసిం. అయితే.. ఇవన్నీ బూటకపు వార్తలు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నౌక కాలువలో చిక్కుకున్న సమయంలో తాను అక్కడికి వందలాది మైళ్ళ దూరంలోని మెడిటెర్రేనియన్ పోర్ట్ సిటీ అలగ్జాండ్రియాలో విధి నిర్వహణలో ఉన్నట్టు ఆమె తెలిపారు.
ఒక మహిళగా తాను ఈ రంగంలో విజయవంతమైనందుకు.. ఈజిప్షియన్ అయినందుకు కూడా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అంటున్నారు. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను కెప్టెన్ స్థాయికి చేరుకోవడం కోసం ఎంతో శ్రమించానని ఆమె చెప్తోంది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తాను చాలా ప్రయత్నాలు చేసానని తెలిపారు. మహిళలు తమ కుటుంబాలకు దూరంగా సముద్రంలో పని చేయడాన్ని సమాజం ఇప్పటికీ అంగీకరించట్లేదని అంటోంది.
471184 916833Spot ill carry on with this write-up, I truly believe this website requirements a fantastic deal far more consideration. Ill oftimes be once much more to see far more, many thanks that information. 632657