జీవితంలో స్నేహం విలువెంతో.. స్నేహంలోని మాధుర్యమెంతో రుచి చూపిస్తున్నారు కొందరు యువకులు. స్నేహితుడు చనిపోతే ఆ మృతదేహంతోనే ఫుట్ బాల్ గోల్ కొట్టించి స్నేహితుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. కన్నీళ్లు తెప్పించే ఈ సంఘటన మెక్సికోలో జరిగింది.
16ఏళ్ల అలెగ్జాండర్ మార్టినెజ్ ఫుట్ బాల్ ప్లేయర్. తల్లితో కలిసి మెక్సికోలో ఉంటున్నాడు. స్థానికంగా జరిగిన పోలీసులు కాల్పుల్లో బుల్లెట్ పొరపాటున మార్టినెజ్ కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అతని టీమ్ మేట్స్ దుఃఖంలో మునిగిపోయారు. మార్టినెజ్ స్వగ్రామం విసెంట్రే కామలోటేలో జరుగుతున్న అంత్యక్రియలకు హాజరయ్యారు.
అయితే.. స్నేహితుడిని ఆనందంగా సాగనంపాలని భావించారు. తలచిందే తడవుగా స్థానికంగా ఉన్న ఫుట్ బాల్ గ్రౌండ్ కు మార్టినెజ్ ఉన్న శవపేటికను తీసుకొచ్చారు. ఓ గోల్ పోస్ట్ ఏర్పాటు చేసి దానికెదురుగా శవపేటికను ఉంచి చుట్టూ నుంచున్నారు. వారిలో ఓ ప్లేయర్ ఫుట్ బాల్ ను కాలితో తన్నాడు. మరో ప్లేయర్ ఆ బాల్ ను మార్టినెజ్ శవపేటికకు ఫార్వార్డ్ చేశాడు. బాల్ ఆ శవపేటికకు తగిలి తిన్నగా గోల్ పోస్ట్ వైపు వెళ్లింది.
గోల్ కీపర్ బాల్ ఆపలేకపోవడంతో గోల్ పోస్ట్ లోకి దూసుకెళ్లి గోల్ అయింది. దీంతో స్నేహితులంతా సంబరాలు చేసుకున్నారు. ఒక్కసారిగా శవపేటికపై పడి భావోద్వేగమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి అనేకమంది భావోద్వేగానికి గురవుతున్నారు. పోలీసుల తప్పిదానికి మెక్సికోలో నిరసనలు జరిగాయి.
#Oaxaca | #Cuenca 🎥 Compañeros de Alexander lo despiden, mete su último gol. pic.twitter.com/dJ9hY2DaTW
— Noticias de Oaxaca | TVBUS (@tvbus) June 11, 2020
253650 236695As I internet site possessor I believe the content material here is genuinely fantastic , regards for your efforts. 5297