తెలంగాణలో పార్టీ పెట్టే దిశగా కసరత్తు చేస్తున్న దివంగత వైఎస్సార్ తనయ షర్మిల.. మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? తెలంగాణలో తన అన్న జగన్ వదిలేసిన ఓదార్పు యాత్రను ఆమె కొనసాగించబోతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. వైఎస్ చనిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది వైఎస్ అభిమానులు చనిపోయినట్టుగా ప్రచారం జరిగింది. దీంతో వారి పెద్ద కొడుకుగా తాను వారిని పరామర్శిస్తానని జగన్ ప్రకటించారు. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రంలో ఓదార్పు యాత్ర కొనసాగించారు.
అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఓదార్పు యాత్ర ఆగిపోయింది. ఈ నేపథ్యంలో షర్మిల ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. వైఎస్ చనిపోయినప్పుడు తెలంగాణలోనూ చాలామంది చనిపోయారని ఆమె పేర్కొన్నారు. దీంతో వారందరినీ షర్మిల పరామర్శించే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణలో పాదయాత్ర చేయాలని ఆమె యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన వైఎస్ అభిమానులను ఓదార్చే అవకాశం ఉంది. తద్వారా క్రీయాశీల రాజకీయాల్లో పట్టు పెంచుకోవచ్చని ఆమె భావిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.
552139 142030Some truly nice and utilitarian info on this internet internet site , likewise I think the design and style holds fantastic functions. 542939
610030 476293Beneficial details. Fortunate me I discovered your internet website by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 474703