‘ప్యాకేజీ ఎవడిచ్చాడ్రా.? కొడాలి నాని స్టయిల్లో అడుగుతున్నాడు.. మీ అమ్మ మొగుడు ఇచ్చాడా ప్యాకేజీ.?’ అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జనసేన నేత నాగబాబు.
‘మాకు వేల కోట్లు లేవు. మాకున్న చిన్న సంపాదన లోంచి ప్రజల్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మీ దగ్గర వేల కోట్లు వున్నాయ్ కదా.. లక్షల కోట్లున్నాయ్ కదా.. వాటిని చేతనైతే ప్రజలకు పంచండి..’ అంటూ నాగబాబు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
‘ప్యాకేజీ’ అంటూ విమర్శిస్తున్నారు కదా.. అని మీడియా ప్రతినిథి ఒకరు ప్రశ్నిస్తే, ‘ఎవడిచ్చాడు.? వైసీపీ నేతల తాతలిచ్చారా.? తండ్రులిచ్చారా.?’ అని ఎదురు ప్రశ్నించారు నాగబాబు.
రామ్ గోపాల్ వర్మ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాగబాబు. ‘రామ్ గోపాల్ వర్మ పెద్ద వెధవ..’ అంటూ తనదైన స్టయిల్లో తిట్టిపోశారు నాగబాబు. ‘కాపుల్ని అమ్మేశారు.. తాకట్టుపెట్టేశారు..’ అంటూ రామ్ గోపాల్ వర్మ వేస్తున్న ట్వీట్లపై నాగబాబు ఇలా స్పందించారు.
‘ఏ కులానికైనా, ఏ మతానికైనా ఆత్మగౌరవం వుంటుంది. ఏ కులం, ఏ మతం గంపగుత్తగా ఎవరికీ అమ్ముడుపోదు. స్వర్గీయ ఎన్టీయార్ని కాపు సామాజిక వర్గం గెలిపించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డినీ, చంద్రబాబునీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డినీ కాపు సామాజిక వర్గం గెలిపించింది. కులం గురించీ, మతం గురించీ అమ్ముడుపోతారని నీఛంగా మాట్లాడటం తగదు. కాపు కులంలో పుట్టినంతమాత్రాన, ఆ కులాన్ని అమ్మేసే.. తాకట్టుపెట్టేసే హక్కు, అవకాశం మాకెలా వుంటుంది.?’ అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్రలోని రణస్థలంలో ‘యువశక్తి’ పేరుతో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగబాబు మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పై విధంగా పేర్కొన్నారు.
732734 835468Excellent info several thanks sharing and reaching us your subscriber list. 261807
168090 57062Ive read several great stuff here. Surely value bookmarking for revisiting. I surprise how considerably effort you put to create 1 of these excellent informative internet site. 134544
420769 102884Someone necessarily assist to make critically articles Id state. This really is the first time I frequented your web page and thus far? I amazed with the analysis you made to make this actual submit incredible. Outstanding activity! 609751