చంద్రబాబు హయాంలో రాజధానిగా ఎంపికైన అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు అవసరం అనీ, అందులో పదో వంతు.. అంటే 10 వేల కోట్లు ఖర్చు చేయగలిగితే, విశాఖపట్నం లాంటి నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దొచ్చని క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ అంటూ ఇప్పటికే విశాఖపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్న విషయం విదితమే.
దానికి కొనసాగింపుగా, మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు వున్నట్లుగా అర్థం చేసుకోవాలేమో. అయితే, 10 వేల కోట్లతో విశాఖపట్నం నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా, రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దడం సాధ్యమేనా.? అన్నదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మొన్నీమధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు 1300 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయిస్తూ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ‘ఇది తొలి విడత అభివృద్ధి కార్యక్రమం.. ముందు ముందు ఇలాంటివి చాలానే వుంటాయి..’ అని తన సొంత నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు వైఎస్ జగన్.
మరి, ఓ మహా నగరానికి రాజధాని హోదా తీసుకురావాలనుకున్నప్పుడు కేవలం 10 వేల కోట్లు సరిపోతాయా.? ఇదే ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. లక్ష కోట్లు అనేది ప్రస్తుతం రాష్ట్రం వున్న ఆర్థిక ఇబ్బందుల్లో చాలా కష్టమైన విషయమే. కానీ, తమ పబ్లిసిటీ కోసం అధికార పార్టీలు చేసే ఖర్చుతో పోల్చి చూసినా, ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయ పార్టీలు చేసే ఖర్చుతో పోల్చి చూసినా.. లక్ష కోట్లు పెద్ద విషయమే కాదు. కానీ, ఇది ప్రజా ధనం. అన్నట్టు, అది కూడా ప్రజాధనమే.. అది అవినీతి ద్వారా సంపాదించి, తమ రాజకీయ ఎదుగుదల కోసం చేసే ఖర్చు. ఇది, ప్రజల కోసం ప్రభుత్వాల తరఫున చేసే ఖర్చు. అంతే తేడా.
682201 657719Some really wondrous function on behalf of the owner of this web site, perfectly excellent subject material . 323940
298197 653346You ought to get involved in a contest first of the greatest blogs over the internet. Ill recommend this page! 906998
387068 596046Hello! Nice post! Please do keep us posted when we can see a follow up! 737811