Varalaxmi: మీడియాలో తనపై వస్తున్న అసత్య కథనాలపై మండిపడ్డారు ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi saratkumar). డ్రగ్స్ కేసులో ఆమెకు నోటీసులు అందాయంటూ కొన్ని వార్తలు వైరల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ‘మీడియాకు సరైన వార్తలు లేకపోవడంతో అవాస్తవాలైన పాత వార్తలు ప్రసారం చేస్తున్నాయి. సమాజంలో ఎంతో పేరున్న వెబ్ సైట్స్, జర్నలిస్టులు నిజమైన వార్తలు ఎందుకు రాయరు..? సెలబ్రిటీల మీద దృష్టిపెట్టి అవాస్తవాలు రాయడం మానుకోండి. మేము తప్పితే మీకు మరొక న్యూస్ లేదన్నట్టు వ్యవహరించడం సరికాదు’.
‘మేము నటులుగా సినిమాల్లో మంచి పాత్రలతో అలరించాలని నిత్యం కష్టపడుతూంటాం. మరి.. మీరెందుకు మీ పని చేయరు. సమాజానికి ఉపయోగపడే వార్తలు ఎందుకు రాయరు. బయట 1000 సమస్యలు ఉన్నాయి. వాటి మీద మీ దృష్టి పెట్టండి. మా మౌనాన్ని చేతకానితనంగా భావించొద్దు. పరువు నష్టం కేసులు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. నిరాధారమైన వార్తలు వైరల్ చేయడం ఆపండి. జర్నలిజాన్న బతికించండ’ని ఘాటుగా స్పందించారు.
Since the admin of this web page is working, no uncertainty very quickly it
will be well-known, due to its quality contents.