అమెరికా అనగానే.. పెద్ద పెద్ద భవనాలు, విలాసవంతమైన జీవితం, డాలర్లు కళ్లముందు కదలాడతాయి. కానీ ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి ఏమీ బాగోలేదు. అమెరికా అప్పుల కుప్ప విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అమెరికా రుణాలు 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు ఆ దేశ చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ పేర్కొన్నారు. భారత్ కు కూడా 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉన్నట్టు వివరించారు. 2020 నాటికే అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే ఆ దేశంలో సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నట్టు తెలిపారు.
గతేడాది తీసుకున్న రుణాన్ని పంచితే ఒక్కొక్కరికీ పంచితే 10వేల డాలర్లు తెలిపారు. పైగా అమెరికాకు మిత్రదేశాలు కాని చైనా, జపాన్ కే ఎక్కువ రుణపడి ఉన్నట్టు చెప్పారు. రెండు ట్రిలియన్ డాలర్ల విలువ చేసే కరోనా ఉద్దీపన ప్యాకేజీకి వ్యతిరేకిస్తూ మూనీ ఈ మేరకు వెల్లడించారు. 2000 సంవత్సరంలో 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పుడు ఒబామా హయాంలో రెండింతలయ్యాయని వివరించారు. దీన్ని రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నారని, ఇది మంచిది కాదని స్పష్టంచేశారు.