స్నేహితుడి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. విందు వినోదాలు పూర్తయ్యాక గోదావరి నదిలో ఈత కొట్టాలనుకున్నారు. అదే వారి పాలిట శాపమైంది. నదిలో ఈత కొట్టడానికి దిగిన వారంతా నదిలో గల్లంతయ్యారు. దీంతో అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన 25 ఏళ్ల లోపు యువకులు.. స్నేహితులు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ములుగు జిల్లాలో జరిగిందీ దారుణం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని వెంకటాపురం మండలం రంగరాజపురం కాలనీకి చెందిన 16 మంది తమ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. వేడుక అనంతరం వీరంతా పాత మరిశాల వద్ద గోదావరి నదిలో ఈతకు దిగారు. వీరిలో నలుగురు యువకులు రాయవరపు ప్రకాశ్ (23), అన్వేశ్ (23), శ్రీకాంత్ (21), తుమ్మ కార్తీక్ (21) ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. మిగిలిన 12 మంది ఒడ్డుకు చేరారు. యువకుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. శనివారం రాత్రికి ప్రకాశ్, కార్తీక్ మృతదేహాలు వెలికి తీశారు.
చీకటి పడిపోవడంతో శనివారం రాత్రి గాలింపు చర్యలు నిలిపేశారు. ఆదివారం ఉదయం అన్వేశ్, శ్రీకాంత్ మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలకు వెంకటాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో అక్కడంతా విషాదం నెలకొంది.
292176 313023An intriguing discussion is worth comment. I believe that you ought to write regarding this subject, it may possibly not be a taboo subject but generally persons are too couple of to chat on such topics. To another location. Cheers 834383
28000 7250I like this internet web site because so much utile stuff on here : D. 744
238761 918971Hello Guru, what entice you to post an write-up. This article was very intriguing, specifically since I was looking for thoughts on this subject last Thursday. 479120