ఒకవైపు చంద్రబాబు తెలంగాణనాయకులపై ఆరోపణలు చేస్తుంటే మరో వైపు చంద్రబాబుపై తెలంగాణ నాయకులు విరుచుకుపడుతున్నారు. దీనివల్ల నాయకులే నష్టపోతారేమో అనిపిస్తుంది. ఒకప్పుడు అమాయకంగా నాయకులు చెప్పినట్టు ఓటు వేసేవారు కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి అంశాన్ని సునిశితంగా ఆలోచిస్తున్నారు.
గతంలో తెలంగాణ ఎన్నికల సమయంలోనూ ప్రజలతో మాయమాటలు చెప్పినందునే చిత్తుగా ఓడిపోయారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉంటే చంద్రబాబు కాస్త సంయమనం పాటించి వ్యవహరించవలసి ఉంటుంది. లేకుంటే ఆయన మాటలకు ఖండనలు, లేదా ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో ఆంధ్రవారిపై దాడులు చేస్తున్నారన్న బాబు ఆరోపణలను తెలంగాణ నాయకుడు తలసాని తిప్పికొట్టారు. హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని, వాళ్ల ఆస్తులు లాగేసుకుంటున్నారని ‘చంద్రబాబునాయుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు’ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసలు, హైదరాబాద్ లో ఎక్కువ ఆస్తులు ఉంది చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకే అని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందని పరిపాలన చేతగాని దద్దమ్మ చంద్రబాబు అంటున్నారని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. సత్యహరిశ్చంద్రుడు తన ఇంటి పక్కనే పుట్టినట్టుగా, నీతికి నిజాయతీగా మారుపేరైనట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
253438 458680I surely did not realize that. Learnt a thing new nowadays! Thanks for that. 24778
391849 573669Most heavy duty trailer hitches are designed utilizing cutting edge computer aided models and fatigue stress testing to ensure optimal strength. Share new discoveries with your child and maintain your child safe by purchasing the correct design for your lifestyle by following the Perfect Stroller Buyers Guideline. 19737