తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది విడత ప్రచార భేరిని మోగించనున్నారు. లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయన తొలి ప్రచార సభ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నల్గొండ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ప్రారంభం కానుంది. 5.30 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల ఉమ్మడి సభలో పాల్గొంటారు.
సభలను భారీఎత్తున నిర్వహించేందుకు టిఆర్ ఎస్ సన్నాహాలు చేసింది. సీఎం చివరి సారిగా ఈ నెల 19న నిజామాబాద్ సభలో పాల్గొన్నారు. అప్పటికి అభ్యర్థులు ఖరారు కాలేదు. గత పది రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం సభలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
శుక్రవారం సభల్లో పూర్తిగా కొత్త అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. నల్గొండలో వేమిరెడ్డి నర్సింహారెడ్డి, సికింద్రాబాద్లో తలసాని సాయికిరణ్, చేవెళ్లలో రంజిత్రెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ప్రతి శాసనసభ స్థానం నుంచి 25 వేల మంది చొప్పున జనసమీకరణ చేయాలని పార్టీ భావిస్తోంది.
మిర్యాలగూడ సభకు మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఎల్బీ స్టేడియం సభకు మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్అలీ, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు.
శుక్రవారం మరోవైపు టిఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్ల సెగ్మెంటు పరిధిలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలోనూ సభల్లో పాల్గొననున్నారు. కేటీఆర్ సభలు, రోడ్షోలు వచ్చే నెల 9 వరకు వరుసగా ఉంటాయి.
339833 848102Just wanna input on couple of general points, The website style is perfect, the articles is extremely wonderful : D. 884514