ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ఐఐసీసీలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. 27వ తేదీ (బుధవారం) ఉదయం 11.05 గంటలకు పార్టీ పతాక ఆవిష్కరణ.. అనంతరం అధ్యక్షుడి స్వాగతోపన్యాసం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే రోజున దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
కోవిడ్ కారణాల వల్ల రెండేళ్లుగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని సరిగా నిర్వహించలేదు. గతేడాది ఇదే సమయంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్టోబర్ 25న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగానే ఉండటంతో ఈసారి ఏప్రిల్ 27నే నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున పార్టీ ప్లీనరీని కూడా నిర్వహించనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో హాజరుకానున్నారు.
464409 303833This sort of in search of get the enhancements created on this unique lifestyle and diet, begin your L . a . Shifting the pounds diet answer is actually a huge procedure into accesing which normally hope. weight loss 975888
935223 39387I conceive this web site contains some rattling superb data for every person : D. 467223