కరోనా వ్యాక్సినేషన్ ప్రభుత్వ కార్యక్రమమే అయినా పార్టీల మధ్య విబేధాలు మాత్రం వెలుగుచూస్తున్నాయి. ఇందుకు కారణం ఫ్లెక్సీలే. మొన్న ఏపీలో జరిగినట్టుగానే ఈరోజు తెలంగాణలో జరిగింది.
ఫ్లెక్సీపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో టీఆర్ఎస్ నేతలకు వారికీ మధ్య భారీ వ్యాగ్యుద్దం జరిగింది.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేదు. దీంతో బీజేపీ జడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మనంద్, పీఏసీఎస్ చైర్మన్ ముండే సంజీవ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కేసీఆర్ ఫొటో మాత్రమే ఉన్న ఫ్లెక్సీని చింపేశారు.
దీంతో టీఆర్ఎస్ ఎంపీపీ రాథోడ్ పుండలిక్, బీజేపీ జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. వెంటనే వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు.
225525 587067I genuinely prize your function , Wonderful post. 709385
942390 36462But wanna say that this really is very helpful , Thanks for taking your time to write this. 899731