మెగాస్టార్ చిరంజీవి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయ్యి చాలా కాలమే అయింది. ఆ తర్వాత వారి నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కాంబినేషన్స్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అవ్వడం కష్టమే అనుకున్నారంతా. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్ చివరికి టాకీ, నవంబర్ చివరికి పాటలు షూటింగ్ పూర్తి చేయాలన్నది ప్లాన్. డిసెంబర్ అంతా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ తో జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఇక త్రివిక్రమ్ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలి. కానీ వచ్చే ఏడాది చివరికి కానీ అల్లు అర్జున్ ఫ్రీ అవ్వడు కాబట్టి ఈ గ్యాప్ లో చిరంజీవి ప్రాజెక్ట్ సెట్ చేయొచ్చేమో అని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. చూడాలి మరి ఏం జరుగుతుందో.