టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా సందడి మొదలైంది. వరసగా స్టార్ హీరోల సినిమాలు అన్నీ ప్యాన్ ఇండియాను గురి చేస్తున్నాయి. తెలుగు సినిమాలు ఇలా అన్ని భాషల్లో విడుదలవుతుండడం శుభపరిణామమే అయినా బాలీవుడ్ నుండి గట్టి పోటీ ఎదురుకాబోతోంది.
జులై 2న అడివి శేష్ నటిస్తోన్న మేజర్ విడుదలవుతోంది కానీ అదే రోజున షేర్షా చిత్రం బాక్స్ ఆఫీస్ ను ఢీ కొట్టబోతోంది. ఈ రెండూ కూడా దేశభక్తి ప్రధానంగా నడిచే చిత్రాలే కావడం విశేషం.
అలాగే జులై 30న రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదలవుతోంది. ఇక అదే రోజున సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన అలియా భట్ చిత్రం గంగూభాయ్ కథియావాడి కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆగస్ట్ 13న అల్లు అర్జున్ పుష్ప, జాన్ అబ్రహం అటాక్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. అలాగే అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతుండగా అక్టోబర్ 15న మైదాన్ విడుదలవుతోంది. మరి ఈ పోటీలో బాలీవుడ్, టాలీవుడ్ లలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.
13958 613274Id forever want to be update on new articles on this website, bookmarked ! . 502165