తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇటీవల వరుసగా కరోనాతో కన్నుమూస్తున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా మృతి చెందుతూనే ఉన్నారు. ఈసారి నిర్మాత.. ప్రముఖ పీఆర్వో బీఏ రాజు గుండె పోటుతో మృతి చెందారు. షుగర్ వ్యాధితో గత కొంత కాలంగా బాధ పడుతున్న బీఏ రాజు కు శుక్రవారం అర్థరాత్రి సమయంలో గుండె పోటుతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు వెళ్లడించారు. 1500 సినిమాలకు పైగా పీఆర్వోగా చేశారు. ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలకు ఇప్పటి స్టార్ హీరోలకు వ్యక్తిగత పీఆర్వోగా కూడా ఆయన వ్యవహరించారు.
ఇండస్ట్రీ పెద్దలకు తలలో నాలుక మాదిరిగా ఉంటూ ఏ కార్యక్రమం అయినా ముందు ఉండే బీఏ రాజు మృతి ఇండస్ట్రీ వర్గాల వారిని తీవ్రంగా కలచి వేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడిగా పేరు దక్కించుకున్న బీఏ రాజు ఇండస్ట్రీ వర్గాల్లో చాలా మందికి ఆప్తుడిగా నిలిచారు. పీఆర్ గానే కాకుండా సూపర్ హిట్ అనే మ్యాగజైన్ ను నిర్వహించారు. 2003 లో నిర్మాతగా మారి భార్య బీ జయ గారి దర్శకత్వంలో పలు సినిమాలను నిర్మించారు. 2018 లో బీ జయ చనిపోయారు. అప్పటి నుండే బీఏ రాజు కృంగిపోయారు. ఆ తర్వాత కోలుకున్నట్లుగా కనిపించినా అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండేవి. రాత్రి గుండె పోటుతో ఆయన మృతి చెందారు. ఇండస్ట్రీ వర్గాలు మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. బీఏ రాజుకు ఇద్దరుకు కుమారులు.
574984 924552Id need to have to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make men and women feel. Also, appreciate your permitting me to comment! 946788
988535 653019Yay google is my king helped me to discover this outstanding site! . 425499
815961 764247Wow! This could be one specific with the most beneficial blogs Weve ever arrive across on this subject. In fact Fantastic. Im also an expert in this subject therefore I can understand your hard function. 54997