తెలుగులో నేనొక్కడినే మరియు దోచెయ్ సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే సీత పాత్ర గురించి తన వ్యక్తిగత జీవితం గురించి కృతి సనన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ముంబయిలో సినిమా ఛాన్స్ ల కోసం సుదీర్ఘ కాలం పాటు ప్రయత్నాలు చేశాను. కాని నేను ఎంతగా ప్రయత్నించినా కూడా ఫలితం దక్కక పోవడంతో నిరాశ కలిగేది. ఒంటరితనంతో పిచ్చెక్కి పోయేది. దాంతో నేను అమ్మకు ఫోన్ చేసిన సందర్బాలు ఉన్నాయి. సినిమాల్లో చాన్స్ లు వస్తూ సక్సెస్ దక్కించుకుంటున్న సమయంలో చాలా మంది స్నేహితులు అయ్యారు. మహేష్ బాబు నేనొక్కడినే సినిమా షూటింగ్ మొదటి రోజు గోవాలో జరుపుతున్నారు. నేను కాస్త ఆలస్యం గా వెళ్లాను. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను వెళ్లేప్పటికి మహేష్ బాబు గారు సీన్ పేపర్లు చూసుకుంటూ వెయిట్ చేస్తున్నారు. దాంతో నేను ఏదో ఇబ్బంది పడుతూ చాలా టేక్ లు తిన్నాను. ఆ సమయంలో నన్ను కూల్ చేసేందుకు మహేష్ బాబు చాలా సహనంతో ఉన్నారు. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆయన నటించారు.
449029 734352I actually enjoy reading on this website, it holds great articles . 826429