సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కు అతి ముఖ్యమైన సీజన్స్ లో దసరా కూడా ఒకటి. ఈ సీజన్ లో కనీసం రెండు సినిమాలైనా ప్రతీ ఏడాదీ విడుదలవుతుంటాయి. అయితే ఈసారి దసరాకు మాత్రం ముక్కోణపు పోటీ తప్పట్లేదు. ముందుగా అక్టోబర్ 19న నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఆకర్షణీయంగా ఉంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.
ఇక అదే రోజున విజయ్ డబ్బింగ్ చిత్రం లియో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. డబ్బింగ్ చిత్రమే అయినప్పటికీ ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇక అక్టోబర్ 20న రవితేజ చిత్రం టైగర్ నాగేశ్వర రావు ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టువర్టుపురం గజదొంగ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ఇది. ప్రోమోలన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. మరి ఈ మూడు భిన్న చిత్రాల్లో ప్రేక్షకుల ఓటు దేనికి పడుతుంది అన్నది చూడాలి.