జమ్ముకాశ్మీర్ లో మరోసారి ఉగ్రమూక హింసకు పాల్పడింది. జవాన్లపైనే కాకుండా ఉగ్రవాదులు అప్పుడప్పుడు బీజేపీ నాయకులను మరియు ఇతర పార్టీల నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేస్తూ ఉంటుంది. ఈసారి బీజేపీ నాయకులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. కుల్లాంలోని వైకే పొరా అనే గ్రామంలో బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కారులో ప్రయాణిస్తున్న కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లుగా స్థానికుల మరియు పోలీసు వర్గాల వారు చెబుతున్నారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు అక్కడికి అక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరికొందరు కూడా గాయాల పాలయ్యారు. దాంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు తెలియజేశారు. ఉగ్రవాదులు బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేయడంపై ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ దెబ్బ తీసిన ఉగ్రవాదులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ ఆ పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు హెచ్చరించారు. పోలీసులు ఉగ్రవాదులను గుర్తించే పనిలో ఉన్నారు.
904208 414986We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 447240
319770 622759extremely nice post, i certainly enjoy this amazing website, persist with it 918780