‘భాష’ అమ్మ వంటిది అంటారు. ఎవరెక్కడ ఉన్నా మాతృభషకు ఇచ్చే గౌరవం ఇస్తూనే ఉండాలి. మన భాషను మనం గౌరవించుకోవడం కంటే.. ఇతర ప్రాంతాల్లో మన భాషకు తగిన గౌరవం దక్కినప్పుడే అసలైన విజయం అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్లో అదే జరిగింది. తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ ఆ రాష్ట్ర తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగువారిలో ఆనందోత్సాహాలు నింపుతోంది. ఏళ్లుగా ఇందుకోసం పోరాడుతున్న వారికి ప్రభుత్వ ప్రకటన సాంత్వన చేకూర్చింది.
పశ్చిమబంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థఛటర్జీ ఈమేరకు ప్రకటన చేశారు. ఎప్పటినుంచో బెంగాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు మమతా బెనర్జీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలోని ఖరగ్ పూర్ లో ఎక్కువగా తెలుగు వారు నివసిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్ సర్కార్ తెలుగు భాష కోసం కృషి చేశారని కొనియాడుతున్నారు. స్వతహాగానే ఈ నిర్ణయంపై రాజకీయం పులుముకుంది. ఎన్నికల నేపథ్యంలోనే మమత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఆరోపించింది.
548431 842410Watch the strategies presented continue reading to discover and just listen how to carry out this remarkable like you organize your company at the moment. educational 19061