Switch to English

తెలంగాణలో కరోనా మరణాలపై ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నా.. మరణాల సంఖ్య 9, 10 మాత్రమే నమోదవుతుండడం వెనుక అసలు కారణమేంటి.?’ అంటూ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా విషయమై మొదటి నుంచీ హైకోర్టు, ప్రభుత్వ తీరు పట్ల మొదటి నుంచీ అసహనం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. హైకోర్టు అక్షింతలు, మొట్టికాయల నేపథ్యంలోనే ప్రస్తుతం కరోనా టెస్టులు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయన్నది నిర్వివాదాంశం.

ఇక, కరోనా మరణాల విషయానికొస్తే, తెలంగాణలో వాస్తవ పరిస్థితులకీ, ప్రభుత్వం చూపుతున్న లెక్కలకీ సంబంధమే లేదన్న ఆరోపణలున్నాయి. ‘వివిధ కారణాలతో మృతిచెందినవారికి కరోనా పరీక్షలు చేయడంలేదు..’ అంటూ గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించుకుంది. అదొక్కటే కాదు, కరోనా వైరస్‌ సోకినా, ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యలతో చనిపోయినవారిని కరోనా మృతుల జాబితాలో వెయ్యబోమని సాక్షాత్తూ తెలంగాణ హెల్త్‌ మినిస్టర్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో, అసలు తెలంగాణలో కరోనా మరణాలు ఎన్ని.? అన్న ప్రశ్న అందర్నీ వేధిస్తున్న మాట వాస్తవం.

ప్రధానంగా హైద్రాబాద్‌లో పలు స్మశాన వాటికల్లో గుట్టు చప్పుడు కాకుండా కరోనా మృతులకు అంత్యక్రియల్ని నిర్వహిస్తున్నారన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు మీడియాలో సంచలనాత్మక కథనాలూ రావడంతో, న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇవన్నీ ఓ ఎత్తు.. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ ఇంకో ఎత్తు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వైద్య చికిత్స విషయమై ప్రభుత్వం కొన్ని గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. అయితే, ప్రభుత్వం జారీ చేసిన గైడ్‌ లైన్స్‌కి భిన్నంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి చాలా కార్పొరేట్‌ ఆసుపత్రులు. లక్షల్లో వసూళ్ళకు పాల్పడుతూ పేషెంట్ల కుటుంబాల్ని పిప్పి పీల్చి చేస్తున్నాయి. ఈ అంశంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదా.? కొన్ని ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వ చర్యలు ఒకలా, ఇంకొన్ని ఆసుపత్రుల విషయంలో ఇంకోలా ఎందుకు వుంటున్నాయి.?’ అని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం.

60 వేల పైచిలుకు పరీక్షలు ఈ మధ్య ప్రతిరోజూ జరుగుతుండగా, 2 వేల నుంచి 3 వేల మధ్య నిత్యం కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి తెలంగాణలో. అయితే, అధికారిక లెక్కలతో పొంతన లేకుండా తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా వుందన్న వాదనలు లేకపోలేదు. సమగ్ర సమాచారం కోసం ఉన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన దరిమిలా.. ప్రభుత్వం తరఫు సమాధానం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...