ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పేదలకు ఇవ్వదలచిన ఇళ్ల స్థలాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాజమహేంద్రవరంలోని వైశ్య సేవా సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్న సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో విచారణ జరిపిన హైకోర్టు ఈ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై స్టే విధించింది.
వైశ్య సేవా సదన్ చెందిన 32 ఎకరాలను ఇళ్ల స్థలాలకు తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం దేవదాయ ధర్మాదాయశాఖ పరిధిలో వైశ్య సేవా సదన్ ఉంది. ఈ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై విమర్శలు వచ్చాయి.
730334 654923I think this internet site contains some very very good information for everyone : D. 899716