ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబుకు హోం శాఖ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ కేటాయించారు. కన్నబాబుకు ప్రాణహాణి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇకపై చేసే పర్యటనలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోనే చేయలని సూచించింది. ఈ నివేదికను హోంశాఖకు పంపించాయి. రాష్ట్ర మంత్రిగా కీలకమైన వ్యవసాయ శాఖను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కన్నబాబు.
వారం రోజుల క్రితమే కన్నబాబుకు బీపీ వాహనం కేటాయించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హోంశాఖకు సూచించాయి. దీంతో ఆయన బులెట్ ప్రూఫ్ వాహనంలోనే పర్యటిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ముఖ్య నాయకుడిగా కన్నబాబు ఉన్నారు. జర్నలిస్టుగా ఉన్న కన్నబాబు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. అనంతరం వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కాకినాడు రూరల్ నియోజకవర్గం నుంచి కన్నబాబు గెలుపోందారు.
340679 106922You must indulge in a contest for among the greatest blogs more than the internet. Ill suggest this web internet site! 821699