Switch to English

రెండో ఆలోచనే లేదు.. గెలుపు టీడీపీదే: చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే గెలుపు అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని పేర్కొన్నారు. ఇందులో రెండో ఆలోచనే లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు తమకు వచ్చిన సమాచారం మేరకు 130కి పైగా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వివరించారు. ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదని చెప్పారు. వందకు వంద శాతం గెలుపు టీడీపీదేనని ఉద్ఘాటించారు. ఓటమి భయంతోనే వైఎస్సార్ సీపీ పలుచోట్ల విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. వారి వల్లే అర్ధరాత్రి వరకు పోలింగ్ సాగే పరిస్థితి నెలకొందని.. మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే ఇలాంచి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

అయితే, ఎవరు ఎలాంటి కుట్రలు పన్నినప్పటికీ.. ప్రజలు టీడీపీ పక్షాన నిలిచి ఓటింగ్ శాతం పెంచారని పేర్కొన్నారు. అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. వచ్చే 40 రోజులు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద షిప్టులవారీగా కాపలా కాయాలని పేర్కొన్నారు.

వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఆనవాయితీ. గత ఎన్నికల్లోనూ పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే, ఈసారి మాత్రం ఆయన మీడియాతో మాట్లాడలేదు. సాయంత్రం 8.30 గంటల సమయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గెలుపు తమదేనని.. భారీ మెజార్టీతో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. ఓటింగ్ శాతం తగ్గించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందని, కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.

జగన్ మాట్లాడిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మాట్లాడతారని అంతా భావించారు. పోలింగ్ సరళి, తమ విజయావకాశాలపై మాట్లాడటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. అయితే, అర్థరాత్రి దాటినప్పటికీ చంద్రబాబు మీడియా ముందుకు రాలేదు. కొన్నిచోట్ల అర్ధరాత్రి 12.30 గంటల వరకు కూడా పోలింగ్ సాగడంతో ఆయన పరిస్థితిని సమీక్షిస్తూ ఉండిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, వారితో మాట్లాడారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....