ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈవీఎంల మొరాయింపు, పలుచోట్ల హింస చోటుచేసుకున్నప్పటికీ పోలింగ్ మాత్రం భారీగానే నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 76.69 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 71.43 శాతం ఓటింగ్ నమోదుకాగా, పలు చోట్ల అర్ధరాత్రి 12.30 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది.
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ అంచనాలను ఈసీ ప్రకటించింది. పూర్తి వివరాలు మధ్యాహ్నానికి వెల్లడించే అవకాశం ఉంది. కాగా, ఏపీ ఎన్నికల్లో ఈసారి హింసాత్మక సంఘటనలు అధికంగా చోటుచేసుకున్నాయి. ఈవీఎంలు కూడా చాలాచోట్ల మొరాయించాయి. ఎండ భయంతో ఉదయాన్నే ఓటు వేద్దామనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. అయితే, చాలా కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. వాటిని సరిచేసి, పోలింగ్ మొదలుపెట్టేసరికి చాలా సమయం పట్టింది. చాలా కేంద్రాల్లో మూడు గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ మొదలైన కేంద్రాలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పలు చోట్ల ఈసీపై జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఈవీఎం మొరాయించింది. దీంతో ఆయన మధ్యాహ్నం మరోసారి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వచ్చింది.
ఇక గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈసారి హింస కూడా చోటుచేసుకుంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలచోట్ల టీడీపీ, వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వీరాపురంలో జరిగిన ఘర్షణల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చింతా భాస్కరరెడ్డి మృతిచెందగా.. వైఎస్సార్ సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుంలో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘర్షణల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రమణారెడ్డి మృతి చెందారు. ఈసారి జరిగిన ఎన్నికల హింసలో పలువురు అభ్యర్థులు కూడా గాయపడ్డారు.
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు, నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవిందబాబు, నరసరావుపేట వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కూడా గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా కురుపాం వైఎస్సార్ సీపీ అభ్యర్థి పుష్పశ్రావణి, ఆమె భర్త, అనుచరులపై టీడీపీ వర్గీయులు దాడి చేసి పాఠశాల భవనంలో నిర్బంధించారు. గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్వర్రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఇలా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనలన్నీ పోలింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించారు.
అయితే, ప్రజలు సాయంత్రానికి పెద్ద సంఖ్యలో ఓటరు కేంద్రాలకు చేరుకున్నారు. 6 గంటల లోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటేసే అవకాశం ఉందని ఈసీ స్పష్టంచేయడంతో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు చాలామంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. శ్రీకాకుళంలో 72 శాతం, విజయనగరం-85, విశాఖపట్నం-70, తూర్పుగోదావరి-81, పశ్చిమ గోదావరి-70, కృష్ణా-79, గుంటూరు-80, ప్రకాశం-85, నెల్లూరు-75, కడప-70, కర్నూలు-73, అనంతపురం-78, చిత్తూరులో 79 శాతం పోలింగ్ నమోదైంది.
850548 323998Hey There. I discovered your blog making use of msn. That can be a quite smartly written post. I will make positive to bookmark it and come back to read much more of your valuable data. Thanks for the post. I will undoubtedly return. 798514
375393 838627Hosting a weblog composing facility (in a broad sense) requires unlimited space. So I suggest you to discover such web hosting (internet space provider) that give flexibility inside your internet space. 624857
341127 677259Some genuinely wonderful info , Gladiola I detected this. 610017